E-Paper
Advertisement

Minister Sridhar babu: పదేళ్లు అవసరం లేదు.. జస్ట్ ఐదేళ్లలో ఫ్యూచర్ సిటీ రెడీ.. మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar babu: పదేళ్లు అవసరం లేదు.. జస్ట్ ఐదేళ్లలో ఫ్యూచర్ సిటీ రెడీ.. మంత్రి శ్రీధర్ బాబు
Advertisement

Minister Sridhar babu: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు తమకు ఐదేళ్ల చాలని, పదేళ్ల కాలవ్యవధి అవసరం లేదంటూ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా భారీగా పెట్టుబడులు తెచ్చిన విషయం కూడ తెలిసిందే. అయితే ఈ పర్యటన గురించి మీడియాతో చిట్ చాట్ గా మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు మంత్రి.

మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లు పాలన సాగినా, ఒకేసారి ఇంత మొత్తంలో పెట్టుబడులు తెలంగాణకు రాలేదన్నారు. ఏపీ ప్రభుత్వం చాలా పెద్ద ప్రణాళికతో దావోస్ పర్యటనకు వచ్చిందని, భవిష్యత్తులో ఏపీకి మంచి పెట్టుబడులు వస్తాయంటూ మంత్రి జోస్యం చెప్పారు. తెలంగాణకు అధిక సంఖ్యలో పెట్టుబడులు రావడానికి గల కారణం ఎనర్జీ పాలసీ తీసుకు రావడమేనంటూ మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక్కొక్క డేటా సెంటర్ ఏర్పాటుకు 5 నుండి 10 ఎకరాలు అవసరం అవుతాయని, అందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ సాగుతుందన్నారు.

Advertisement

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో 5 సంవత్సరాలలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసి తీరుతామని, తమకు పదేళ్లు అవసరం లేదంటూ మంత్రి పునరుద్ఘాటించారు. అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ గురించి మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ కంటే ట్రంప్ పెద్ద మాయగాడంటూ అభివర్ణించారు. కేసీఆర్ ఎన్నికలకు ఏం కావాలో అదే మాట్లాడారని, కానీ ట్రంప్ భిన్నరీతిలో మాట్లాడినట్లు మంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావూస్ పర్యటనలో ఎక్కడ కూడా ఏకపక్షంగా మాట్లాడలేదంటూ మంత్రి అన్నారు.

Also Read: Prakasam Crime: అన్నా నువ్వే దిక్కని వస్తే.. పక్కా ప్లానేసి మరీ చంపేశాడు

Advertisement

ఫిబ్రవరి 7 తారీఖున అతి పెద్ద ప్రకటన ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా చెప్పడం విశేషం. చర్లపల్లి వద్ద రెండు పెద్ద షాపింగ్ మాల్స్ నిర్మిస్తామన్నారు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ తెచ్చిన పాలసీలను ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుని వెళుతున్నారని, అయితే ఆ పాలసీలను ఒక్కరే ఒక్కరు ఆపారంటూ మంత్రి చెప్పారు. అదికూడా ఏపీ గత ముఖ్యమంత్రి జగన్ మాత్రమే.. అటువంటి ధోరణితో పాలను సాగించారన్నారు. రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు అందించడం పై ప్రజలు సంతోషంగా ఉన్నారని, అభివృద్ధి పరంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో తాము పోటీ పడాలని అనుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×