E-Paper
Advertisement

Minister Sridharbabu: వ్యవస్థలను కాలరాసిన వ్యక్తులు మాట్లాడుతుంటే ‘నాకు నవ్వొస్తుంది’: మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridharbabu: వ్యవస్థలను కాలరాసిన వ్యక్తులు మాట్లాడుతుంటే ‘నాకు నవ్వొస్తుంది’: మంత్రి శ్రీధర్ బాబు
Advertisement

Minister Sridharbabu on BRS: బీఆర్ఎస్ పార్టీ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వ్యవస్థలను కాలరాసిన వ్యక్తులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు గతంలో ఎలా వ్యవహరించారో అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు వారు మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది. వారు మాట్లాడుతున్న తీరును చూసి ఏం మాట్లాడాలో అర్థమవడంలేదు. పీఏసీ చైర్మన్ బీఆర్ఎస్ నేత అని స్వయంగా చెప్పుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చింది బీఆర్ఎస్సే. నిబంధనల ప్రకారమే పీఏసీ చైర్మన్ పదవి నియామకం జరిగింది’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Also Read: బీసీ కుల గణనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు… 3 నెలల్లోపు..

Advertisement

నియమ నిబంధనల ప్రకారమే అసెంబ్లీ కమిటీల నియామకం జరిగింది. పీఏసీ చైర్మన్ ను కూడా శాసనసభ నిబంధనల ప్రకారమే స్పీకర్ నియమించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ చెప్పారు. బీఆర్ఎస్ నేతలతో పీఏసీ చైర్మన్ కు అభిప్రాయభేదాలు ఉంటే మాకేం సంబంధం? రాష్ట్రంలో సర్కారును నడపాలని ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు.

Also Read: మీ ప్లానింగ్ బాగుంది.. తెలంగాణ ప్రభుత్వంపై ఆర్థిక సంఘం ప్రశంసలు

Advertisement

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా రాష్ట్రంలో ఏదో జరుగుతదని బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులు తిరిగారు. అంత తిరిగిన తరువాత కూడా ప్రజలు మరోసారి బ్రహ్మండమైన తీర్పు ఇచ్చారు. వారికి ఒక్కటంటే ఒక్క సీటు ఇవ్వలేదు. బీఆర్ఎస్ వైఖరి ఇంకా మారడంలేదనే లోక్ సభ ఎన్నికల్లోనూ ప్రజలు జీరో తీర్పు ఇచ్చారు. జీరో ఎంపీ సీట్లు ఇచ్చినా కూడా ఆ పార్టీ నేతల వైఖరి ఇంకా మారడంలేదు. ఇంతకు రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు వ్యవస్థలను గౌరవించాలి’ అంటూ శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×