Water Wastage: స్వేచ్ఛ బ్యూరో: ట్యాంక్ నిండా నీరు ఫెల్లు నీరు.. విచిత్రం ఎంటంటే గ్రామానికి మాత్రం నీరు కరువు. గౌడవెల్లిలో మిషన్ భగీరథ నీటి వృథాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో మిషన్ భగీరథ ఓవర్హెడ్ ట్యాంక్ నుంచి తాగునీరు పొంగిపొర్లుతూ వృథా అవుతున్నా, మరోవైపు గ్రామంలోని పలు కాలనీలకు తాగునీరు సక్రమంగా అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నీటి కోసం ప్రజలు ఎదురుచూస్తుండగా, ట్యాంక్ వద్ద మాత్రం వేల లీటర్ల నీరు రోడ్డుపైకి చేరి వృథాగా పోతుండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.
Also read: TGSRTC: కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. అయితే మీకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్..?
ట్యాంక్ ఓవర్ఫ్లో సమస్యను వెంటనే పరిష్కరించి గ్రామ ప్రజలకు ప్రతిరోజూ తాగునీటిని నిరంతరాయంగా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ లక్ష్యం ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడమే అయినప్పటికీ, ఇలాంటి లోపాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు పేర్కొన్నారు.
Also read: Drug Rehabilitation: చంచల్గూడ, చర్లపల్లి ఖైదీలు ఎం చేసారో తెలిస్తే మీ మైండ్ బ్లాకే..?