DNS Pollution: BIGTV కథనంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుకుమార్ రెడ్డి స్పందించారు. DNS గ్రీన్ ఎన్విరోస్ వల్ల ఏర్పడుతున్న కాలుష్యం పై ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్న ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తామని ఎంపీ చామల అన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడి ఈ సమస్యపై ప్రత్యు శ్రద్థ వహిస్తామని తెలిపారు.
అయితే చదువే ముద్దు కాలుష్యం వద్దు అంటూ ఆరెగూడెం పాఠశాల విద్యార్థులు రాష్ట్రపతికి ఉత్తరాలు రాయడం జరిగిందని గుర్తు చేశారు. తాను కూడా కాలుష్యం వెదజల్లే ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తానని ఎంపీ చామల తెలిపారు. ప్రజల ఆరోగ్యమే అన్నిటికంటే ముఖ్యం అని, కంపెనీలు రావడానికి మేము వ్యతిరేకించం కానీ ఇలాంటి కాలుష్య వెదజల్లే కంపెనీలు వ్యవసాయానికి ప్రజలకు ఇబ్బంది కలగని చోట ఉండాలని ప్రధాన ఉద్దేశం అని ఎంపి చామల తెలిపారు.
Also Read: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బిగ్ అడ్వెంచర్ బైక్.. లాంచ్ కు ముందే హిమాలయన్ 750 లీక్!
గతంలో నల్గోండ జిల్లా చిట్యాల మండలంలో ఉన్న ఆరెగూడెం పాఠశాలలో విద్యార్ధులు రాష్ట్రపతి కి లేకలు రాసారు. మమ్ములను కాలుష్యం లోనుండి కాపాడండి అంటూ కాలుష్యం వద్దు.. చదువే ముద్దు అంటూ కాలుష్యం వెదజల్లుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని గతం లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు లేకుల రాయడం కలకం రేపింది. కంపెనీలో నుండి వచ్చు దుర్వాసన వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్ధులు వాపోయారు.
Also Read: కల్తీ తిని రోగాల బారిన పడుతున్నారా? కరీంనగర్ ఇంజనీర్ సూపర్ సొల్యూషన్!