Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 25 వేల ఓట్ల మెజారిటీతో ప్రజలు తనను గెలిపించారని, జూబ్లీహిల్స్ ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయనని హామీ ఇచ్చారు. విజయం సాధించిన అనంతరం నవీన్ యాదవ్ మీడియాతో మాట్లడుతూ.. ‘‘అందరినీ కలుపుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. మన ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తా. అభివృద్ధే నా ఎజెండా.’’ అని వ్యాఖ్యానించారు.
‘‘నా మీద నమ్మకం పెట్టుకొని.. మా పిల్లోడు.. మా బస్తీ పిల్లోడు.. మా కొడుకు.. మా తమ్ముడు.. మాకు అండగా ఉంటాడు.. మా కష్టాల్లో నిలబడతాడు మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు’’ అని అన్నారు.
‘‘మా ప్రాంత సమస్యలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తాను. గతంలో బిఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే. నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. నవీన్ యాదవ్ ఈరోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనంఅంతా ఒకటే. అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం. కలిసి పని చేసుకుందాం.’’ అని ఈ సందర్భంగా అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద, నన్ను, మా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేస్తూ అనేక దుష్ప్రచారాలు చేశారని.. వాటికి ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం: నవీన్ యాదవ్
భారీ మెజారిటీతో ప్రజలు నన్ను గెలిపించారు
జూబ్లీహిల్స్ ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయను
అందరినీ కలుపుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా
మన ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తా
అభివృద్ధే నా ఎజెండా… pic.twitter.com/cOictY6MMe
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2025
Read Also: Ktr Logic: కేటీఆర్ లాజిక్.. 2028లో బీఆర్ఎస్ దే విజయం! ఎలాగంటే?