E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ఘోరం.. RS.17CR విలువైన డ్రగ్స్ సీజ్, నిందితుల అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోరం.. RS.17CR విలువైన డ్రగ్స్ సీజ్, నిందితుల అరెస్ట్

భాగ్యనగరంలో మరోసారి భారీ స్థాయిలో మాదకద్రవ్యాల కలకలం రేగింది. మౌలాలి పారిశ్రామిక ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న డ్రగ్ తయారీ కేంద్రంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 17.40 కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రసాయన యూనిట్ వేదికగా సాగుతున్న ఈ దందాను ఎన్‌సిబి బృందం చాకచక్యంగా ఛేదించింది.

పరిశ్రమల ముసుగులో ప్రాణాంతకమైన డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు. మౌలాలి ఐడిఎలోని ఒక కెమికల్ యూనిట్‌లో సోదాలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ నిల్వ ఉంచిన రెండు ప్లాస్టిక్ డ్రమ్ములను తనిఖీ చేయగా.. మొత్తం 69.600 కిలోల అల్ప్రజోలామ్ లభించింది. వీటితో పాటు మత్తు పదార్థాల తయారీకి వినియోగించే భారీ పరిమాణంలో ఎఫెడ్రిన్ రసాయనాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అక్రమ దందాలో కీలక పాత్ర పోషిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. పట్టుబడిన వారిలో ఒక అనుభవజ్ఞుడైన కెమిస్ట్ ఉన్నట్లు సమాచారం. డ్రగ్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేసే వ్యక్తితో పాటు.. తయారైన మత్తు పదార్థాలను ఇతర ప్రాంతాలకు తరలించే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి డ్రగ్స్ తయారీకి ఉపయోగించే అత్యాధునిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో భాగంగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. సాధారణంగా వేసవి కాలంలో తెలంగాణ వ్యాప్తంగా కల్లు దుకాణాలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కల్లులో కలిపేందుకు అల్ప్రజోలామ్‌ను భారీగా విక్రయించాలని నిందితులు ప్లాన్ చేశారు. కల్లు తాగేవారిని బానిసలుగా మార్చేందుకు ఈ రసాయనాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పట్టుబడిన ఈ డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్లో 17 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నిందితులపై ఎన్‌డిపిఎస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మాదకద్రవ్యాల వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ముడి పదార్థాల సరఫరా ఎక్కడి నుండి జరుగుతోంది? ఈ నెట్‌వర్క్ ఇతర రాష్ట్రాలకు విస్తరించి ఉందా? అనే విషయాలను ఎన్‌సిబి ఆరా తీస్తోంది. హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు సాగకుండా నిఘా పెంచామని అధికారులు హెచ్చరించారు.

ALSO READ: రూ.1,20,000 జీతంలో జాబ్స్.. ఈ వయస్సు మించరాదు, జస్ట్ ఇంటర్వూతోనే ఉద్యోగం బ్రో

Related News

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Big Stories

×