E-Paper
Advertisement

Uttam Kumar Reddy on New Ration Cards: కాకినాడ రేషన్ ట్రాన్స్‌పోర్టు.. కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ, ఎప్పుడంటే

Uttam Kumar Reddy on New Ration Cards: కాకినాడ రేషన్ ట్రాన్స్‌పోర్టు.. కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ, ఎప్పుడంటే
Advertisement

Uttam Kumar Reddy on New Ration Cards: దాదాపు పదేళ్ల తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులను ఇవ్వబోతోంది కాంగ్రెస్ సర్కార్. దీనికి సంబందించి ఆ శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం పక్కదానిపై పట్టడంపైనా ఆశక్తికరమైన కామెంట్స్ చేశారాయన.

సోమవారం శాసనమండలిలో కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం ఉంటుందన్నారు. కులగణన సర్వే ఆధారంగా లబ్దిదారుల ఎంపిక చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశం ఇస్తామన్నారు.

Advertisement

ఇప్పటికే కులగణనపై డేటా సేకరించామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. కొత్త రేషన్ కార్డులపై దరఖాస్తులు తీసుకుని ప్రభుత్వం వద్దనున్న డేటా బేస్‌తో కంపేర్ చేసి కొత్త కార్డులు ఇస్తామన్నారు. రేషన్ డీలర్ల ఖాళీలుంటే వెంటనే ఫుల్ చేయాలని ఇప్పటికే కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చామన్నారు. భర్తీ కాకుండా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సభ్యులకు తెలిపారు.

రేషన్‌ కార్డుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తెచ్చారు. కాకినాడ పోర్టుకు రేషన్‌ బియ్యం పోతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. అనర్హులు కూడా రేషన్ కార్డు పొంది ప్రభుత్వం ఆదాయానికి గండి పెడుతున్నారన్నారు.

Advertisement

ALSO READ: అసెంబ్లీలో పంచాయితీ నిధుల లొల్లి.. మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్, చేతులెత్తేసిన హరీష్‌‌రావు

దీనిపైనా మంత్రి ఉత్తమ్ స్పందించారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వాస్తవమన్నారు. ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈలెక్కన కొత్త కార్డుల వారికి మంత్రి శుభవార్త చెప్పారు.

 

 

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×