BigTV English
Advertisement

Uttam Kumar Reddy on New Ration Cards: కాకినాడ రేషన్ ట్రాన్స్‌పోర్టు.. కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ, ఎప్పుడంటే

Uttam Kumar Reddy on New Ration Cards: కాకినాడ రేషన్ ట్రాన్స్‌పోర్టు.. కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ, ఎప్పుడంటే

Uttam Kumar Reddy on New Ration Cards: దాదాపు పదేళ్ల తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులను ఇవ్వబోతోంది కాంగ్రెస్ సర్కార్. దీనికి సంబందించి ఆ శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం పక్కదానిపై పట్టడంపైనా ఆశక్తికరమైన కామెంట్స్ చేశారాయన.


సోమవారం శాసనమండలిలో కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం ఉంటుందన్నారు. కులగణన సర్వే ఆధారంగా లబ్దిదారుల ఎంపిక చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశం ఇస్తామన్నారు.

ఇప్పటికే కులగణనపై డేటా సేకరించామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. కొత్త రేషన్ కార్డులపై దరఖాస్తులు తీసుకుని ప్రభుత్వం వద్దనున్న డేటా బేస్‌తో కంపేర్ చేసి కొత్త కార్డులు ఇస్తామన్నారు. రేషన్ డీలర్ల ఖాళీలుంటే వెంటనే ఫుల్ చేయాలని ఇప్పటికే కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చామన్నారు. భర్తీ కాకుండా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సభ్యులకు తెలిపారు.


రేషన్‌ కార్డుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తెచ్చారు. కాకినాడ పోర్టుకు రేషన్‌ బియ్యం పోతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. అనర్హులు కూడా రేషన్ కార్డు పొంది ప్రభుత్వం ఆదాయానికి గండి పెడుతున్నారన్నారు.

ALSO READ: అసెంబ్లీలో పంచాయితీ నిధుల లొల్లి.. మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్, చేతులెత్తేసిన హరీష్‌‌రావు

దీనిపైనా మంత్రి ఉత్తమ్ స్పందించారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వాస్తవమన్నారు. ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈలెక్కన కొత్త కార్డుల వారికి మంత్రి శుభవార్త చెప్పారు.

 

 

Related News

Jubilee Hills By Elections: ఇంకా రెండు రోజులే టైం.. జూబ్లీహిల్స్ ఎన్నికలపై టెన్షన్ టెన్షన్..

Defecting MLAs: కొనసాగుతున్న రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ..

Maganti Family Issue: నా కొడుకు ఎలా చనిపోయాడో కేటీఆర్ చెప్పాలి? మాగంటి తల్లి బ్లాస్ట్..

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Karimnagar: కొడుకు అరెస్ట్ అంటూ సైబర్ మోసగాళ్ల కాల్.. తండ్రికి గుండెపోటు!

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

Big Stories

×