Konda Surekha vs KTR: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా.. ప్రజాప్రతినిధుల కోర్టు మంత్రి కొండా సురేఖపై కోర్టు ఆగ్రహం వ్యక్తిం చేసింది.
బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా.. నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడంపై ప్రజాప్రతినిధుల కోర్టు సీరియస్ అయింది. హాజరు కాకపోవడానికి గల సరైన కారణాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది.
కేసు విచారణలో భాగంగా ఈ వారెంట్ జారీ కావడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. అనంతరం, ఈ పరువునష్టం దావా కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టుకు హాజరయ్యే విషయంలో మంత్రి కొండా సురేఖ తదుపరి ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కోర్టు తదుపరి విచారణ తేదీ నాటికి మంత్రి హాజరవుతారా లేక కోర్టు నిర్ణయంపై న్యాయపరమైన సవాలు చేస్తారా అనేది చూడాలి.
ALSO READ: Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితం.. తల్లిపై కూతురు విజయం