BigTV English

Medigadda Barrage: రిపేర్ చేయలేం.. మేడిగడ్డను కూల్చాల్సిందే.. NDSA నివేదిక

Medigadda Barrage: రిపేర్ చేయలేం.. మేడిగడ్డను కూల్చాల్సిందే.. NDSA నివేదిక

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్‌ను కూల్చి మళ్లీ కడితేనే మంచిదనే అభిప్రాయాన్ని నేషనల్ ​డ్యామ్​ సేఫ్టీ అథారిటీ వ్యక్తం చేసింది. కుంగిన దానిని కూల్చి.. కొత్తగా నిర్మిస్తేనే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తుది నివేదికలో కమిటీ పేర్కొన్నట్టు సమాచారం. ఏడో బ్లాక్ ​కింద భారీ అగాధం ఉందని.. దాన్ని ఇప్పటికే గ్రౌటింగ్‌లో పూడ్చారని.. ఈ బ్లాక్‌కు రిపేర్లు చేసినా ఎన్నాళ్లు పటిష్టంగా ఉంటుందనే విషయం చెప్పలేమని రిపోర్టులో వెల్లడించినట్టు సమాచారం. కొద్దిపాటి వరదకే ఏడో బ్లాక్​ కుంగిందని.. భవిష్యత్తులో భారీ వరద వస్తే తట్టుకుంటుందన్న గ్యారంటీ లేదని పేర్కొన్నట్టు సమాచారం. బ్యారేజీ కట్టిన ప్రాంతంలో నది వెడల్పు ఒక్కసారిగా కుచించుకుపోయినట్టు ఉంటుందని.. ఫలితంగా భారీ వరద వస్తే తన్నుకొచ్చే ప్రమాదం ఎక్కువని నివేదికలో ఉన్నట్లు సమాచారం.


మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లన్నీ లోపభూయిష్టంగానే ఉన్నాయని రిపోర్టులో కమిటీ స్పష్టం చేసినట్టు తెలిసింది. బ్యారేజీ సైట్‌లో టెస్టులు చేశాక.. డిజైన్లు ఫైనల్​ చేయాల్సి ఉన్నా.. అలా చేయలేదని నివేదికలో పేర్కొంది. అరకొరగా టెస్టులు చేశారని.. బ్యారేజీకి దిగువన సీసీ బ్లాకులు, ఆప్రాన్ల వంటి ప్రొటెక్షన్​ వర్క్స్ సరిగా లేవని ఆక్షేపించినట్టు తెలుస్తోంది. జియోఫిజికల్, జియోటెక్నికల్​ టెస్టులను సరిగా నిర్వహించకుండానే బ్యారేజీకి డిజైన్లను ఖరారు చేశారని పేర్కొన్నట్టు సమాచారం.

బ్యారేజీ కుంగిన తర్వాత.. అక్కడ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్​ చేయాలని చెప్పినా సరిగా చేయలేదని, గ్రౌటింగ్ ​చేసి అక్కడున్న ఎవిడెన్స్‌ తుడిచిపెట్టారని వెల్లడించినట్టు సమాచారం. బ్యారేజీ కట్టినప్పటి నుంచి ఆపరేషన్​ అండ్​ మెయింటెనెన్స్‌ పట్టించుకోలేదని.. ఎప్పటికప్పుడు మానిటర్ ​చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యం ప్రదర్శించారని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.


Also Read:  ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు.. మాజీ మంత్రి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు, ముగ్గురు అరెస్ట్

రిపోర్టును కొద్దిరోజుల క్రితమే కేంద్ర జలశక్తి శాఖకు..NDSA సమర్పించింది. ఇటీవల సీతారామ ప్రాజెక్టుపై జరిగిన టెక్నికల్​అప్రైజల్ కమిటీ మీటింగ్‌లో రిపోర్టుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆ నివేదికను చూపించే… సీతారామ డిజైన్లపై మరోసారి రివ్యూ చేయించుకోవాలని అధికారులకు కేంద్రం సూచించిందని సమాచారం. NDSA ఫైనల్​ రిపోర్టును కేంద్ర సర్కార్ మరో రెండు వారాల్లో రాష్ట్రానికి అందజేయనుంది. ఈ రిపోర్టు కోసమే కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్ ​కూడా వేచి చూస్తోంది. రిపోర్టు ప్రకారం కమిషన్ ​చర్యలను సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×