BigTV English

Telugu states : తెలుగు రాష్ట్రాల మధ్య భూముల ధరల పంచాయితీ.. మాటల యుద్ధం

Telugu states : తెలుగు రాష్ట్రాల మధ్య భూముల ధరల పంచాయితీ.. మాటల యుద్ధం

Telugu states News(Morning news today telugu): తెలుగు రాష్ట్రాల మధ్య భూముల ధరల పంచాయితీ మొదలైంది. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చు అంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్‌ అయ్యాయి . ఈ మాట తాను అనడం లేదని….చంద్రబాబే చెప్పారని అంటున్నారు కేసీఆర్‌. రోజురోజుకు తెలంగాణలో భూముల ధరలు అమాంతం పెరుగుతున్నాయన్నారు.

ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్ముకొంటే తెలంగాణ మూడేకరాలు వచ్చేవి కానీ గత నాలుగేళ్లుగా ఏపీలో అభివృద్ధి నిలిచిపోవడంతో భూముల ధరలు పెరగలేదంటూ ఇటీవల కామెంట్స్‌ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలంగాణలో జోరుగా అభివృద్ధి జరుగుతుండటంతో అక్కడ భూముల ధరలు బాగా పెరిగాయని…. ఇప్పుడు అక్కడ ఒక ఎకరం అమ్ముకొంటే ఏపీలో 50-100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు. ఇందుకు.. ఏపీలో అభివృద్ధి లేకపోవడమే కారణమన్నారు.


చంద్రబాబు వ్యాఖ్యలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్‌. తెలంగాణలో భూముల గురించి పక్క రాష్ట్రాలే చెబుతున్నాయని అంటున్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు….. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కౌంటరిచ్చారు. ఏపీలో భూముల ధరలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడారో తెలియదన్నారు. విశాఖలో కూడా ఎకరం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హైదరాబాద్ కాకుండా బయటికి వెళితే ధర ఎక్కడుందని ప్రశ్నించారు.


Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×