E-Paper
Advertisement

Telugu states : తెలుగు రాష్ట్రాల మధ్య భూముల ధరల పంచాయితీ.. మాటల యుద్ధం

Telugu states : తెలుగు రాష్ట్రాల మధ్య భూముల ధరల పంచాయితీ.. మాటల యుద్ధం

Telugu states News(Morning news today telugu): తెలుగు రాష్ట్రాల మధ్య భూముల ధరల పంచాయితీ మొదలైంది. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చు అంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్‌ అయ్యాయి . ఈ మాట తాను అనడం లేదని….చంద్రబాబే చెప్పారని అంటున్నారు కేసీఆర్‌. రోజురోజుకు తెలంగాణలో భూముల ధరలు అమాంతం పెరుగుతున్నాయన్నారు.

ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్ముకొంటే తెలంగాణ మూడేకరాలు వచ్చేవి కానీ గత నాలుగేళ్లుగా ఏపీలో అభివృద్ధి నిలిచిపోవడంతో భూముల ధరలు పెరగలేదంటూ ఇటీవల కామెంట్స్‌ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలంగాణలో జోరుగా అభివృద్ధి జరుగుతుండటంతో అక్కడ భూముల ధరలు బాగా పెరిగాయని…. ఇప్పుడు అక్కడ ఒక ఎకరం అమ్ముకొంటే ఏపీలో 50-100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు. ఇందుకు.. ఏపీలో అభివృద్ధి లేకపోవడమే కారణమన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్‌. తెలంగాణలో భూముల గురించి పక్క రాష్ట్రాలే చెబుతున్నాయని అంటున్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు….. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కౌంటరిచ్చారు. ఏపీలో భూముల ధరలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడారో తెలియదన్నారు. విశాఖలో కూడా ఎకరం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హైదరాబాద్ కాకుండా బయటికి వెళితే ధర ఎక్కడుందని ప్రశ్నించారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×