E-Paper
Advertisement

Telugu states : తెలుగు రాష్ట్రాల మధ్య భూముల ధరల పంచాయితీ.. మాటల యుద్ధం

Telugu states : తెలుగు రాష్ట్రాల మధ్య భూముల ధరల పంచాయితీ.. మాటల యుద్ధం
Advertisement

Telugu states News(Morning news today telugu): తెలుగు రాష్ట్రాల మధ్య భూముల ధరల పంచాయితీ మొదలైంది. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చు అంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్‌ అయ్యాయి . ఈ మాట తాను అనడం లేదని….చంద్రబాబే చెప్పారని అంటున్నారు కేసీఆర్‌. రోజురోజుకు తెలంగాణలో భూముల ధరలు అమాంతం పెరుగుతున్నాయన్నారు.

ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్ముకొంటే తెలంగాణ మూడేకరాలు వచ్చేవి కానీ గత నాలుగేళ్లుగా ఏపీలో అభివృద్ధి నిలిచిపోవడంతో భూముల ధరలు పెరగలేదంటూ ఇటీవల కామెంట్స్‌ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలంగాణలో జోరుగా అభివృద్ధి జరుగుతుండటంతో అక్కడ భూముల ధరలు బాగా పెరిగాయని…. ఇప్పుడు అక్కడ ఒక ఎకరం అమ్ముకొంటే ఏపీలో 50-100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు. ఇందుకు.. ఏపీలో అభివృద్ధి లేకపోవడమే కారణమన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్‌. తెలంగాణలో భూముల గురించి పక్క రాష్ట్రాలే చెబుతున్నాయని అంటున్నారు.

Advertisement

మరోవైపు సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు….. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కౌంటరిచ్చారు. ఏపీలో భూముల ధరలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడారో తెలియదన్నారు. విశాఖలో కూడా ఎకరం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హైదరాబాద్ కాకుండా బయటికి వెళితే ధర ఎక్కడుందని ప్రశ్నించారు.

Related News

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Big Stories

Advertisement
×