E-Paper
Advertisement

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఏం తేల్చింది? కమిషన్‌ విచారణ ఎంతవరకు వచ్చింది? ఇంకా విచారణ ఎన్నిరోజులు పట్టే అవకాశముంది? ప్రస్తుతం బహిరంగ విచారణ జరుగుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ మొదలుపెట్టింది. తొలిరోజు శుక్రవారం ఏడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు, రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేషన్ అధికారులు హాజరయ్యారు.

మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అని రీసెర్చ్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణానికి ముందు, మధ్య, ఆ తర్వాత మోడల్స్ చేపట్టినట్టు తెలిపారు. మోడల్ స్టడీస్ పూర్తి కాకముందు నిర్మాణం మొదలైనట్టు అంగీకరించారు. ప్రాజెక్టు డ్యామేజ్ వెనుక నీళ్లను స్టోరేజ్ చేయడమే కారణమని ప్రస్తావించారు.

ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులునిర్లక్ష్యం వహించడమే దీనికి కారణంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. మోడల్ స్టడీస్ తర్వాత పలు రకాల మార్పులు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు గుర్తు చేశారట. నీటిని స్టోరేజ్ చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారని గుచ్చిగుచ్చి ప్రశ్నించింది కమిషన్. నిబంధనల ప్రకారమే పని చేశామని ఇంజనీర్లు అన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

2016 నుంచి 2023 వరకు మోడల్ స్టడీస్ చేసినట్టు రీసెర్చ్ ఇంజనీర్లు తెలిపారట. కమిషన్ అడిగిన కొన్ని ప్రశ్నలకు అధికారులు తడబడినట్లు అంతర్గత సమాచారం. దానికి సంబంధించి కొన్ని డీటేల్స్ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఒకొక్కరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. గత నెలలో 15 మందిని విచారించింది కమిషన్, అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిపై కమిషన్ విచారణ జరుపుతోంది.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×