E-Paper
Advertisement

Mahesh Kumar Goud: బీఆర్ఎస్ మూడు ముక్కలైంది.. మళ్లీ కాంగ్రెస్‌దే విజయం, మహేష్ కుమార్ గౌడ్ ధీమా

Mahesh Kumar Goud: బీఆర్ఎస్ మూడు ముక్కలైంది.. మళ్లీ కాంగ్రెస్‌దే విజయం, మహేష్ కుమార్ గౌడ్ ధీమా
Advertisement

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన ముద్ర వేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో జరిగిన ఎస్సీ సెల్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల పాలనలో ప్రజలను వంచించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మూడు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును దోచుకోవడం, దాచుకోవడం, ఆపై పంచుకోవడంలో తలెత్తిన విభేదాల వల్లే ఆ పార్టీ ఈ స్థితికి చేరుకుందని విమర్శించారు. దళితులను తీవ్రంగా అవమానించిన చరిత్ర ఉన్న బీజేపీకి తెలంగాణలో అధికారం దక్కడం కల్ల అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ పునాదుల్లోనే దళితవాదం ఇమిడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సామాజిక న్యాయం పాటించడంలో తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని గుర్తు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా దళితుడైన మల్లికార్జున ఖర్గేను ఎన్నుకోవడం కాంగ్రెస్ చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు. పార్టీలో పదవుల పంపిణీ విషయంలోనూ సమతుల్యత పాటిస్తున్నామని చెప్పారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే.. బీసీ వర్గానికి చెందిన తనకు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించారని వివరించారు. పెద్ద పదవులు దక్కించుకోవాలనే ఆశయం ఉన్నవారికి కాంగ్రెస్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు.

Advertisement

కవ్వంపల్లి సత్యనారాయణ సమర్థతపై నమ్మకంతోనే ఆయనకు ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించడంలో దళిత సోదరులు కీలక పాత్ర పోషించారని కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దళితులు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఛైర్మన్ పదవులతో పాటు రాష్ట్ర, జిల్లా కమిటీల్లో దళితులకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో 17 శాతం ఉన్న ఎస్సీలకు నాలుగు మంత్రి పదవులు కేటాయించి తమ గౌరవాన్ని చాటుకున్నామని వెల్లడించారు.

దళితులు, గిరిజనులను విస్మరించిన ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. గతంలో కేసీఆర్ తన కేబినెట్‌లో ఉన్న దళిత నేత రాజయ్యను అర్థరాత్రి వేళ బర్తరఫ్ చేసి ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. ఇటువంటి చర్యలే ఆ పార్టీ పతనానికి దారితీస్తున్నాయని విశ్లేషించారు. రాబోయే మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Advertisement

ALSO READ: Supreme Court: బీఆర్ఎస్ పార్టీకి సుప్రీం కోర్టులో షాక్​.. ఆ వ్యవహారంలో స్పీకర్​ నిర్ణయమే ఫైనల్​

Related News

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

బహదూర్‌గూడలో హైటెన్షన్.. పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరేసి రైతులు.. ఎందుకంటే?

Food Adulteration Law: ఆహార కల్తీ దందాకు ఇక చెక్.. తెలంగాణలో రాబోతున్న కొత్త చట్టం ఇదే!

ఉప్పల్‌‌లో దారుణం.. తల్లిని ఇంట్లో బంధించి, నగ్నంగా రోడ్డుపైకి.. ఆపై చెరువులో శవమై.. అసలేం జరిగింది?

హై అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్!

Bike Theft Gang: షామీర్‌పేటలో బైక్ దొంగల ముఠా అరెస్ట్.. ఎక్కడ దాచారో తెలిస్తే మీ మైండ్ బ్లాకే!

Big Stories

Advertisement
×