E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం
Advertisement

PM Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయానికి విచ్చేసిన ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘనంగా స్వాగతం పలికారు. అధికారిక లాంఛనాలతో ప్రధానికి స్వాగత పలికిన అనంతరం.. మోదీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్‌ఐసీసీ (HICC)కి బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సుమారు రూ. 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ఇటీవల నాలుగు రాష్ట్రాలు.. ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ మొదటిసారి హైదరాబాద్‌కు వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బహిరంగ సభలో ఆయన ఇచ్చే సందేశం.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఉత్కంఠగా మారింది. ప్రధాని పర్యటన దృష్ట్యా బేగంపేట నుంచి హెచ్‌ఐసీసీ వరకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Read Also: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా, ప్రపంచ బ్యాంకు టీంతో భేటీ.. నిధులపైనే ఫోకస్!

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×