E-Paper
Advertisement

మేడ్చల్ గడ్డపై మోదీ గర్జన.. రూ. 7 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం- ఈటల

మేడ్చల్ గడ్డపై మోదీ గర్జన.. రూ. 7 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం- ఈటల
Advertisement

Etela Rajender: స్వేచ్ఛ బ్యూరో: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ పర్యటనకు రావడం ఇదే తొలిసారి కావడంతో ప్రజలు సభకు హాజరు కావాలని ఈటల పిలుపునిచ్చారు.

శుక్రవారం గుండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్షులు కావేరీ శ్రీధర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు పర్యటనలో భాగంగా సుమారు రూ.7,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారని రైల్వే, జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈటల రాజేందర్ వివరించారు.

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రధాని పాల్గొనబోయే సభను జన ఆగ్రహ సభగా పేరు పెట్టడం జరిగిందన్నారు, ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, ప్రజా ఆగ్రహ సభ మేడ్చల్ జిల్లా ఇంచార్జి, అంజన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు కృష్ణ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ల దొడ్ల మల్లికార్జును ముదిరాజ్, సముద్రాల హంసారాణి, డివిజన్ ఇంచార్జీ జగన్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్, గడిల విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిలు కృష్ణ, రామారావు, బీజేపీ నాయకులు రవీందర్ గౌడ్, కిషన్, జంగా రెడ్డి, చెంచాల సురేష్,అర్జున్ బాబు, నవనీత, వెంకట్ గౌడ్, రాజు ముదిరాజ్, విక్రమ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: గ్యాస్ ధరల పెంపుపై కడిగిపారేసిన కేటీఆర్.. కేంద్రానికి అల్టిమేటం!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×