E-Paper
Advertisement

KTR : లండన్‌కు కేటీఆర్.. పరారే పరారే!

KTR : లండన్‌కు కేటీఆర్.. పరారే పరారే!

KTR : ఫార్ములా-ఈ కార్ రేసు కేసు కీలక దశకు చేరింది. A1 కేటీఆర్‌ను ఇటీవల సుదీర్ఘంగా విచారించారు. 8 గంటల పాటు ప్రశ్నించారు. రూ.44 కోట్ల గుట్టు లాగే ప్రయత్నం చేశారు. కానీ, కేటీఆర్ తెలివిగా తప్పించుకునేలా సమాధానాలు చెప్పారని అంటున్నారు. అయినా, వదిలేదేలే అనేలా ఏసీబీ మరింత డోసు పెంచింది. ఈసారి కేటీఆర్ సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్స్ తీసుకుని రమ్మని చెప్పింది. కారు రేసు జరిగిన కాలంలో ఆయన వాడిన గాడ్జె్ట్స్‌ను అందించాలని ఆదేశించింది. ఒకవేళ కేటీఆర్ ఆ ఫోన్లు, ల్యాప్‌టాప్స్ ఇచ్చినా అందులోని డేటాను డిలీట్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అలా చేసినా.. ఆ సమాచారం రీట్రీవ్ చేసేందుకు సైతం ఏసీబీ రెడీ అవుతోంది.

ఫోన్లు ఇచ్చేదేలే..?

అయితే, తన ఫోన్లు ఇవ్వాలా వద్దా? అనే దానిపై కేటీఆర్ తన న్యాయవాదుల బృందంతా చర్చించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి కోర్టు తీర్పు లేనప్పుడు మొబైల్ ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదని.. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులను న్యాయవాదులు ప్రస్తావించినట్టు సమాచారం. లాయర్ల సలహా మేరకు తన సెల్‌ఫోన్స్, ల్యాప్ టాప్స్ ఇవ్వకూడదని కేటీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర విషయమూ వెలుగులోకి వచ్చింది.

లండన్‌కు కేటీఆర్.. అందుకేనా?

ఫార్ములా ఈ రేసు కేసు చాలా సీరియస్‌గా సాగుతోంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న ఏ2 ఐఏఎస్ అర్వింద్ కుమార్‌ సెలవులను అర్థాంతరంగా రద్దు చేసింది సర్కారు. ఈ నెల 21 కల్లా హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించింది. సరిగ్గా ఇదే సమయంలో కేటీఆర్ సైతం లండన్ వెళుతుండటం ఆసక్తికరం. ఎందుకు..? ఐఏఎస్ అర్వింద్ ప్రస్తుతం యూరప్ ట్రిప్‌లో ఉన్నారు.. కేటీఆర్ బుధవారం నైట్ లండన్ వెళుతున్నారు.. ఈ రెండింటి మధ్య ఏదైనా లింక్ ఉందా? ఆ లింక్ అదేనా..? కేటీఆర్ లండన్ ట్రిప్ అందుకేనా..? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అర్వింద్ కుమార్‌ను కలిసి మేనేజ్ చేయడానికే అంటూ ప్రచారం కూడా జరుగుతోంది.

ఏదో జరుగుతోందా?

ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో.. ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే సదస్సులో కేటీఆర్ పార్టిసిపేట్ చేస్తారనేది అఫిషియల్ ఇన్ఫర్మేషన్. “ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా” అనే అంశంపై తెలంగాణ అభివృద్ధి కోసం అనుసరించిన విధానాల గురించి కేటీఆర్ ప్రసంగిస్తారని చెబుతున్నారు. బుధవారం రాత్రి బయలుదేరి వెళ్లి.. ఈ నెల 24న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు కేటీఆర్. ఐఏఎస్ అర్వింద్ సైతం ఇంచుమించు ఆ సమయంలో ఫారిన్‌లోనే ఉండనున్నారు. మరి, ప్రచారం జరుగుతున్నట్టు వాళ్లిద్దరూ అక్కడ కలుస్తారా? ఫార్ములా-ఈ కేసులో ఏదో జరుగుతోందా?

Also Read : ఇజ్రాయెల్‌లో తెలంగాణ వాసి మృతి..

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×