BigTV English

Priyanka Gandhi : “ధరణితో కష్టాలు.. ధరలతో ఇబ్బందులు.. బీఆర్ఎస్ కే లాభం”

Priyanka Gandhi : “ధరణితో కష్టాలు.. ధరలతో ఇబ్బందులు.. బీఆర్ఎస్ కే లాభం”
Priyanka Gandhi latest news

Priyanka Gandhi latest news(Telangana congress news):

బీఆర్‌ఎస్‌, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. జహీరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ.. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజలను దోచుకుని ధనవంతులయ్యారని మండిపడ్డారు. ఇలాంటి అవినీతి పాలనను అంతమొందించి జనం కోసం పాటుపడే తమ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


కాంగ్రెస్ పార్టీ అంటేనే సేవ చేయడం అని ప్రియాంక గాంధీ తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్.. ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకుందన్నారు. ధరల పెరుగుదలతో..సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మహిళల కోసం బీఆర్‌ఎస్‌ ఏమైనా చేసిందా? ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ఎందరో ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో.. ధరణి పోర్టల్ తో రైతులకు కష్టాలు పెరిగాయని, రుణమాఫీ హామీని నెరవేర్చలేదని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ప్రజల తెలంగాణ, ప్రజల పాలన రావాలంటే.. కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×