K Nageshwar: జనసేన పార్టీ ఇచ్చిన ఫిర్యాదుతో తనపై నమోదైన కేసులపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టపరమైన చర్యలకు గానీ, అరెస్ట్లకు గానీ తాను అస్సలు భయపడబోనని తేల్చి చెప్పారు. 30 ఏళ్ల వయసులోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దేనికీ లొంగని తాను, ఇప్పుడు 62 ఏళ్ల అనుభవాల వయసులో ఇలాంటి వాటికి అస్సలు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తనపై మోపిన నిందలను ఆయన తీవ్రంగా ఖండించారు. సమాజంలో కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నానని, అల్లర్లు రేపడానికి ప్రయత్నిస్తున్నానని తనపై తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. నిజానికి అవతలి వాళ్లే కులాలు, ప్రాంతాల గురించి మాట్లాడుతూ సమాజాన్ని విడదీసే ప్రయత్నం చేశారని, కానీ తన నోటి నుంచి ఎప్పుడూ అలాంటి మాటలు రాలేదని గుర్తుచేశారు.
రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతలా ఇబ్బంది పెట్టాలని చూసినా భయపడేది లేదని, నిజాయితీగా ప్రజాపక్షాన తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని నాగేశ్వర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Also Read: బాల్క సుమన్ ‘మిలిటెంట్’ రాజకీయం.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసమా? సెల్ఫ్ గోలా?
కేసులకు, అరెస్ట్లకు భయపడను: ప్రొఫెసర్ నాగేశ్వర్
జనసేన ఫిర్యాదుతో తనపై నమోదైన కేసులపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ స్పందించారు. 30 ఏళ్ల వయస్సులోనే దేనికీ భయపడలేదని, ఇప్పుడు 62 ఏళ్ల వయస్సులో అరెస్ట్లకు అస్సలు భయపడబోనని స్పష్టం చేశారు. తనపై కులం, ప్రాంతాల… pic.twitter.com/HwCaWOckSA
— ChotaNews App (@ChotaNewsApp) May 27, 2026