BigTV English

Rachakonda CP: గుట్టుగా చిన్నారుల అమ్మకం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో..!

Rachakonda CP: గుట్టుగా చిన్నారుల అమ్మకం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో..!

Rachakonda CP Press Meet: చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


పీర్జాదిగూడలో నాలుగు రోజుల క్రితం రూ. 4.50 లక్షలకు ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. అయితే ఆమెకు సంబంధించినన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ముఠాగుట్టు రట్టయింది. అయితే ఇప్పటికే ఈ ముఠా 16 మంది చిన్నారులను విక్రయించినట్లు తెలుస్తోంది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ తరుణ్ జోషి మంగళవారం మీడియాకు తెలిపారు. దీనితో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇటీవల మేడిపల్లిలో శోభరాణి, సలీం, స్పప్నలను అరెస్టు చేశాం అని సీపీ చెప్పారు. సంతానం లేని వారికి వీరు పిల్లలను విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు.


Also Read: ఆర్టీవో ఆఫీసుల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు.. ఉద్యోగుల వద్ద లెక్కలు చూపని భారీ నగదు

ఢిల్లీ, పుణె నుంచి చిన్నారులను తీసుకువచ్చి అమ్ముతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఈ ముఠాకు సంబంధించి ఢిల్లీ, పుణెలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ ముఠా తల్లిదండ్రల నుంచి పిల్లలను కొనుగోలు చేసి.. రూ. 1.80 లక్షల నుంచి రూ. 5.50 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సీపీ తెలిపారు.

Tags

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×