Railway Project: స్వేచ్ఛ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకు ఇది నిజంగా తీపి కబురు. మణుగూరు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో రైలు ప్రయాణ కల త్వరలో నెరవేర బోతోంది. రామగుండం – మణుగూరు రైల్వే లైన్ మార్గం సుగమం అయింది. ఎన్నో ఏళ్ల ప్రయత్నాల తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి సూత్ర ప్రాయంగా ఆమోదం లభించింది. “రామగుండం-మణుగూరు రైల్వే మార్గం ఆమోదం శుభ పరిణామం. మేడారం వంటి మారుమూల ప్రాంతాలకు దీనివల్ల ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయంటున్నారు.
రూ.4వేల కోట్లు అంచనా వ్యయం కాగల ఈ ప్రాజెక్ట్ కు రూ.2911.84 కోట్లు 2026-27 బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి. దీంతో మణుగూరు రైల్వే మార్గం కీలక కోల్ కారిడార్ గా మారనుంది. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాలను కలుపుతూ బొగ్గు రవాణా దూరాన్ని తగ్గించనుంది. అట్లే రవాణా వ్యయం తగ్గుతుంది. భద్రాచలం నుండి రామగుండం 286 కి.మీ బదులు 90 కి.మీ దూరం తగ్గుతుంది.
దీని మార్గం, పొడవు 207.80 కిలోమీటర్లు. ఇది రామవరం నుండి మొదలై మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి, కాటాపురం, గోపాలరావుపేట, రామానుజవరం మీదుగా మణుగూరు వరకు ఉంటుంది. 8-10 ఏళ్లలో ఖచ్చితంగా పని పూర్తవాలని నిర్మాణ కాలపరిమితి పెట్టారు. రామగుండం-మణుగూరు రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Also read: ఆ 6 నెలలు నా కలల్ని నాశనం చేశాయి – ఆర్. మాధవన్
గిరిజన ప్రాంతాలకు అనుసంధానం ద్వారా మేడారం వంటి మారుమూల ప్రాంతాలకు రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. న్యూఢిల్లీ-చెన్నై గ్రాండ్ ట్రంక్, నాగ్పూర్-విజయవాడ సెక్షన్కు ప్రత్యామ్నాయ మార్గంగా నిలవనుంది. మరియు భద్రాచలం-కొవ్వూరు రైల్వే మార్గం పూర్తయితే విశాఖపట్నంతో కలుస్తుంది.
బొగ్గును రవాణా సులభతరం చేయడం, ప్రజల ప్రయాణం సౌలభ్యం, వేగవంతమైన అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగ పడనుంది.
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మే నెలలోనే భూసేకరణ ప్రకటన విడుదలైంది. కొన్ని జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సర్వేతో పాటు భూ పరీక్షలు పూర్తయ్యాయి.
Also read: ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్కి సర్కార్ మోక్షం.. ఆ తేదీలోపు చెల్లిస్తే భారీ డిస్కౌంట్..!