Rare Piglet: స్వేచ్ఛ బ్యూరో: నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన కథనం మేరకు గ్రామానికి చెందిన కూరాకుల వెంకటయ్య పందుల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక పందికి మొదటి ఈతలో 7 పిల్లలకు జన్మించాయి. అందులో రెండు పిల్లలు మృతి చెందాయి. ఇందులో ఒకటి ఏనుగు ఆకారాన్ని పోలి ఉండటాన్ని గుర్తించారు.
Also Read: మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి దందా కలకలం
ఏనుగు దంతంలా కనిపించడంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ఈ వింతను చూడటానికి గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైంది అంటూ అక్కడికి వచ్చిన కొందరి మాట్లాడుకోవడం కనిపించింది. జన్యుపరమైన కారణాలతో పంది పిల్ల ఇలా జన్మించి ఉండవచ్చనే అభిప్రాయాలు మరికొందరు అంటున్నారు. ఎదేమైనా ఇలా జన్మించడంతో అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.
Also Read: శ్రీ ఇందు కాలేజీలో విషాదం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య