E-Paper
Advertisement

RevanthReddy : రాజన్నను కేసీఆర్ మోసం చేశారు.. స్థానికుడినే గెలిపించుకోవాలి : రేవంత్ రెడ్డి

RevanthReddy : రాజన్నను కేసీఆర్ మోసం చేశారు.. స్థానికుడినే గెలిపించుకోవాలి : రేవంత్ రెడ్డి
Advertisement

RevanthReddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తాజాగా వేములవాడలో పాదయాత్ర కొనసాగించిన రేవంత్ .. రాజన్నను దర్శనం చేసుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

వేములవాడ రాజన్నను సైతం కేసీఆర్ మోసం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

మిడ్ మానేరు బాధితుల విషయంలో ప్రభుత్వం తీరును రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని మండిపడ్డారు. పెళ్ళైన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు పరిహారం ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పైనా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటారనే విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే స్థానికుడినే
గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలుపించాలని కోరారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×