BigTV English
Advertisement

Pravasi Prajavani: ప్రజా భవన్‌లో ప్రవాసి ప్రజావాణి, తరలివచ్చిన ఎన్నారైలు

Pravasi Prajavani: ప్రజా భవన్‌లో ప్రవాసి ప్రజావాణి, తరలివచ్చిన ఎన్నారైలు

Pravasi Prajavani: తెలంగాణ నుంచి ఉపాది కోసం పెద్ద ఎత్తున యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ఏజెంట్ల మాయంలో అక్కడి వెళ్లి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి బయటపడలేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నవారు లేకపోలేదు. ఫలితంగా గల్ఫ్ వెళ్లే బాధిత కుటుంబాటు అప్పులపాలై రోడ్డున పడుతున్నారు.


వీరి కోసం రేవంత్ సర్కార్ తొలిసారి ప్రవాసి ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రత్యేక కౌంటర్ ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుండి తొలి అభ్యర్థనను స్వీకరించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గల్ఫ్‌లో చనిపోయినవారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసింది. ఆయా కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకుల పాఠశాలలో సీట్లు ప్రత్యేకంగా ఇవ్వనుంది.


గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారికి అక్కడి చట్టాలు తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి కంపెనీలపై అవగాహన కల్పించనున్నారు.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాలేజీ బస్సులు ఢీ.. 20 మంది విద్యార్థులు!

ప్రజలను మోసం చేస్తూ విదేశాలకు పంపించి అక్కడ ఇబ్బందులు పడేలా చేస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పీసీసీ ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్లు, ఇతర ఎన్నారై విభాగం నేతలు హాజరయ్యారు.

 

 

Related News

Maganti Family Issue: నా కొడుకు ఎలా చనిపోయాడో కేటీఆర్ చెప్పాలి? మాగంటి తల్లి బ్లాస్ట్..

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Karimnagar: కొడుకు అరెస్ట్ అంటూ సైబర్ మోసగాళ్ల కాల్.. తండ్రికి గుండెపోటు!

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

Maganti Family Issue: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్.. సునీతకు వ్యతిరేకంగా ఏకమైన మాగంటి ఫ్యామిలీ

Hyderabad: జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ హత్య కేసులో 24 గంటల్లోనే వీడిన మిస్టరీ!

Big Stories

×