E-Paper
Advertisement

Pravasi Prajavani: ప్రజా భవన్‌లో ప్రవాసి ప్రజావాణి, తరలివచ్చిన ఎన్నారైలు

Pravasi Prajavani: ప్రజా భవన్‌లో ప్రవాసి ప్రజావాణి, తరలివచ్చిన ఎన్నారైలు
Advertisement

Pravasi Prajavani: తెలంగాణ నుంచి ఉపాది కోసం పెద్ద ఎత్తున యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ఏజెంట్ల మాయంలో అక్కడి వెళ్లి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి బయటపడలేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నవారు లేకపోలేదు. ఫలితంగా గల్ఫ్ వెళ్లే బాధిత కుటుంబాటు అప్పులపాలై రోడ్డున పడుతున్నారు.

వీరి కోసం రేవంత్ సర్కార్ తొలిసారి ప్రవాసి ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రత్యేక కౌంటర్ ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుండి తొలి అభ్యర్థనను స్వీకరించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Advertisement

తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గల్ఫ్‌లో చనిపోయినవారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసింది. ఆయా కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకుల పాఠశాలలో సీట్లు ప్రత్యేకంగా ఇవ్వనుంది.

గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారికి అక్కడి చట్టాలు తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి కంపెనీలపై అవగాహన కల్పించనున్నారు.

Advertisement

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాలేజీ బస్సులు ఢీ.. 20 మంది విద్యార్థులు!

ప్రజలను మోసం చేస్తూ విదేశాలకు పంపించి అక్కడ ఇబ్బందులు పడేలా చేస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పీసీసీ ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్లు, ఇతర ఎన్నారై విభాగం నేతలు హాజరయ్యారు.

 

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×