E-Paper
Advertisement

Pravasi Prajavani: ప్రజా భవన్‌లో ప్రవాసి ప్రజావాణి, తరలివచ్చిన ఎన్నారైలు

Pravasi Prajavani: ప్రజా భవన్‌లో ప్రవాసి ప్రజావాణి, తరలివచ్చిన ఎన్నారైలు

Pravasi Prajavani: తెలంగాణ నుంచి ఉపాది కోసం పెద్ద ఎత్తున యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ఏజెంట్ల మాయంలో అక్కడి వెళ్లి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి బయటపడలేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నవారు లేకపోలేదు. ఫలితంగా గల్ఫ్ వెళ్లే బాధిత కుటుంబాటు అప్పులపాలై రోడ్డున పడుతున్నారు.

వీరి కోసం రేవంత్ సర్కార్ తొలిసారి ప్రవాసి ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రత్యేక కౌంటర్ ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుండి తొలి అభ్యర్థనను స్వీకరించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గల్ఫ్‌లో చనిపోయినవారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసింది. ఆయా కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకుల పాఠశాలలో సీట్లు ప్రత్యేకంగా ఇవ్వనుంది.

గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారికి అక్కడి చట్టాలు తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి కంపెనీలపై అవగాహన కల్పించనున్నారు.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాలేజీ బస్సులు ఢీ.. 20 మంది విద్యార్థులు!

ప్రజలను మోసం చేస్తూ విదేశాలకు పంపించి అక్కడ ఇబ్బందులు పడేలా చేస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పీసీసీ ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్లు, ఇతర ఎన్నారై విభాగం నేతలు హాజరయ్యారు.

 

 

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×