Hyderabad: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ 30వ వర్థంతి సందర్భంగా ఆయన ఘాటు వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్లో తెల్లవారుజామున నుంచి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు ఆయన కుటుంబసభ్యులు. సమాధిపై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.
ఎన్టీఆర్ వర్ధంతి నేడు.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు
తన తండ్రికి నివాళులు అర్పించారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. మనవడు లోకేశ్తో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, అభిమానులు అక్కడికి వచ్చి నివాళులు అర్పించారు. అలాగే నటుడు కల్యాణ్రామ్ అక్కడికి వచ్చి తాతకు నివాళులర్పించారు. అంతకుముందు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘాట్ను పూలతో తీర్చిదిద్దారు. అంతేకాదు ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవిత విశేషాలతో చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
అటు ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. కారణ జన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిదైన నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడు అని రాసుకొచ్చారు.
ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నివాళి
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతఃస్మరణీయుడు. నటుడిగానే కాకుండా ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శం. అని రాసుకొచ్చారు.
టీడీపీ నేతలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి మహనీయుడికి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఎన్నేళ్లయినా ప్రజల గుండెల్లో జీవించే ఉంటారన్నారు మోత్కుపల్లి నర్సింహులు. పేదవాడి ఆకలిని గుర్తించిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని అన్నారు.
ALSO READ: చౌమహల్లా ప్యాలెస్లో సంగీత కార్యక్రమం, గవర్నర్, సీఎం రేవంత్ హాజరు
ఎన్టీఆర్ వర్ధంతి.. చంద్రబాబు నివాళులు
స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా 'ఎక్స్' వేదికగా ఘన నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు pic.twitter.com/KLEXeHww3m
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2026
ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి ఘన నివాళులు అర్పించిన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి pic.twitter.com/k3YwqFdawH
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2026
నందమూరి తారక రామారావు వర్ధంతి నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన మంత్రి నారా లోకేశ్, సీనియర్ నటుడు బాబు మోహన్ pic.twitter.com/6GPROLxegB
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2026
ఎన్టీఆర్ నా దేవుడు: బాబు మోహన్
నన్ను ఎన్టీఆర్ తమ్ముడు అని సంభోదించేవారు
భూమి ఉన్నంతవరకు నా దేవుడు ఎన్టీఆర్ బతికే ఉంటారు
అన్నగారు మళ్లీ పుట్టి నటుడిగా ఓ వెలుగు వెలగాలి
– బాబు మోహన్ https://t.co/EwvudtLpXl pic.twitter.com/GzqzKLWBlR
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2026