BigTV English
Advertisement

Sajjanar: ఫుట్ బోర్డుపై విద్యార్థుల ప్రయాణం..అసలేం జరిగింది?

Sajjanar: ఫుట్ బోర్డుపై విద్యార్థుల ప్రయాణం..అసలేం జరిగింది?
  •  ఆర్టీసీ ఎంసీ సజ్జనార్ ఆగ్రహం
  • ఎంక్వైరీ చేయాలని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, స్వేచ్ఛ: షాద్ నగర్ విద్యార్థులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు. ఫుడ్ బోర్డు మీద వేలాడుతున్న తమకు భరోసా కల్పించేదెవరని ఆవేదన వ్యక్తం చేశారు. షాద్ నగర్ – ఆమన్ గల్ రూట్‌లో బస్సులు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని సజ్జనార్‌కు లేఖలో వివరించారు విద్యార్థులు గతంలో 10 బస్సులు నడిస్తే ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రూట్‌లో బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. డిగ్రీ కాలేజీలు దూరంగా ఉండడంతో ఆర్టీసీ 35 కిలోమీటర్ల బస్ పాస్ పరిమితి సరిపోవట్లేదని లేఖలో వివరించారు. డిగ్రీ, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వారి కోసం 45, 60 కిలోమీటర్ల వరకు బస్ పాస్ పరిమితి పెంచాలని కోరారు. షాద్ నగర్ – మహబూబ్ నగర్ రూట్‌లో పల్లె వెలుగు బస్సులు నడపాలని సజ్జనార్‌ను కోరారు.


స్పందించిన సజ్జనార్

షాద్ నగర్ విద్యార్థుల సమస్యల మీద ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న మీడియా కథనాలపై రియాక్ట్ అయిన ఆయన, ఈ సమస్య మీద ఎంక్వైరీ చేయాలని అధికారులను ఆదేశించారు.


కాసుల పంట
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ ఆర్టీసీకి కాసుల పంట పండింది. బతుకమ్మ, దసరా పండుగల్లో కోట్ల ఆదాయం వచ్చింది. పండుగల సందర్భంగా పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు జనం. అక్టోబర్ 1 నుండి 15 తేదీ వరకు 707.73 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. దీనివల్ల రూ.307.16 కోట్ల ఆదాయం వచ్చింది. రెగ్యులర్‌గా తిరిగే సాధారణ సర్వీసులు కాకుండా 10,513 ఎగస్ట్రా బస్సులు నడిపారు. ఈ ఏడాది మహాలక్ష్మి ఉచిత బస్సు సర్వీస్ కూడా మహిళలలకు ఉండటంతో బాగా కలిసి వచ్చింది అంటున్నారు అధికారులు.

Related News

Wine Shops Closed: మద్యం ప్రియులకు బిగ్‌ షాక్.. 4 రోజులు వైన్‌ షాపులు బంద్‌.. కారణం ఇదే..!

Hyderabad Metro: చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణ మ్యాప్‌ను సమర్పించండి: హై కోర్టు కీలక ఆదేశం

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌.. సీఎం రేవంత్‌ కీలక సమావేశం

Maganti Gopinath Family Dispute: మాగంటి కుటుంబంలో చిచ్చు.. BRS అభ్యర్థి సునీతకు ఊహించని షాక్

Jubilee Hills by Election: జూబ్లీహిల్స్‌ ఓటర్లకు హై అలర్ట్.. ఫోటో ఐడీ తప్పనిసరి

Telangana: కార్తీక పౌర్ణమి నాడు జంతుబలితో క్షుద్రపూజలు.. స్కూల్‌, శ్మశానవాటికలో..

Chevella Bus Accident: పైనుంచి నా కూతుళ్లు జీతం పంపించారా!! జ్ఞాప‌కాలు గుర్తు చేసుకొని బోరున ఏడ్చేసిన తండ్రి

Telangana Politics: కేసీఆర్‌పై సీబీఐ కేసు.. సీఎం రేవంత్ డిమాండ్‌పై స్పందించిన కిషన్ రెడ్డి

Big Stories

×