E-Paper
Advertisement

GOVERNOR : గవర్నర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ.. ఆ విషయంపై క్లారిటీ..!

GOVERNOR : గవర్నర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ.. ఆ విషయంపై క్లారిటీ..!
Advertisement

GOVERNOR : తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. ఉమ్మడి నియామక బోర్డు బిల్లు ఆమోదంపై విద్యాశాఖ మంత్రి రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించాలని గరవ్నర్‌ సూచించిన నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి తమిళ సైతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్‌ బోర్డుపై గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్ కు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. న్యాయపరమైన చిక్కులు రాకూడదనేదే తన విధానమని తమిళసై స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి నియామక బోర్డు ద్వారా నియామకాలు త్వరగా జరగాలన్నదే తన ఉద్దేశమని తెలిపారు. అయితే నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవని గవర్నర్ కు స్పష్టం చేశారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×