E-Paper
Advertisement

Sales of chicken and mutton : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. 10.5 లక్షల కేజీల చికెన్, 5.5 లక్షల కేజీల మటన్ కుమ్మేశారు..

Sales of chicken and mutton : తెలంగాణలో నిన్న ఆదివారం ఒక్కరోజు మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నాను. డిసెంబర్ 31 అంటేనే ఎంజాయ్ మెంట్ డే అంటారు. అదీ ఆదివారం కావడంతో మరింత జోష్ పెంచింది. దీంతో తెలంగాణలో నిన్న ఆదివారం ఒక్కరోజు మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నాను.

Sales of chicken and mutton :  న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. 10.5 లక్షల కేజీల చికెన్, 5.5 లక్షల కేజీల మటన్ కుమ్మేశారు..
Advertisement

Sales of chicken and mutton : తెలంగాణలో నిన్న ఆదివారం ఒక్కరోజు మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నాను. డిసెంబర్ 31 అంటేనే ఎంజాయ్ మెంట్ డే అంటారు. అదీ ఆదివారం కావడంతో మరింత జోష్ పెంచింది. దీంతో తెలంగాణలో నిన్న ఆదివారం ఒక్కరోజు మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నాను.

సాధారణంగా డిసెంబర్ 31 నైట్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. యువత జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పాత సంవత్సరానికి గుడ్ బై పలికి.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ సంతోషంలో మునిగిపోతుంటారు. అయితే ఆ రోజు చికెన్, మటన్ షాపులు బిజీ బీజీగా ఉన్నాయి. ఉదయం నుంచి మటన్, చికెన్, చేపల మార్కెట్ లో జనాలు కిక్కిరిసి పోయారు. అయితే గడిచిన 24 గంటలలో ఏకంగా 10.5 లక్షల కేజీల చికెన్ , 5.5 లక్షల కెజీల మటన్ ను అమ్మివేశారు.

Advertisement

డిసెంబర్ 31, అందులోనూ ఆదివారం ఇంకేముంది.. జనాల ఎంజాయ్‌మెంట్ కి అడ్డులేకుండా పోయింది. దీంతో నాన్ వెజ్ షాపులు, మందు దుకాణాలు కిటకిటాలాడిపోయాయి. కొత్త ఎడాదిని మస్తు మస్తుగా ఎంజాయ్ చేశారు తెలంగాణ వాసులు. దీంతో నాన్ వెజ్ అమ్మకాలు గత ఏడాది కన్నా ఈ ఏడాది మరింత పెరిగినట్లు తెలుస్తుంది.

మాములు రోజుల్లో అయితే దాదాపుగా 3 లక్షల కేజీల వరకు చికెన్ అమ్ముడుపోతుంది. కానీ నిన్న ఒక్కరోజే 10.5లక్షల చికెన్ కొనుగోలు చేసినట్లు వ్యాపారులు తెలిపారు. కార్తీక మాసం అయిన తర్వాత మళ్లీ చికెన్ అమ్మకాలు పెరిగిపోయాయి. నిన్న అది కాస్త రెట్టింపు అయ్యిందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో కిలో చికెన్ రూ.230 ధర ఉంది. అయితే నిన్న ఒక్క రోజే దాదాపు 10.35 కోట్ల బిజినెస్ జరిగిందని పౌల్ట్రీ రంగ నిపుణులు తెలిపారు.

Advertisement

ఇక మటన్ సైతం రికార్డు స్థాయిలో అమ్ముడు పోయినట్లు సమాచారం. నిన్న ఒక్కరోజే ఏకంగా 5.5 లక్షల కేజీల మటన్ అమ్మడు పోయినట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్ లో మటన ధర కిలో రూ.800 నుంచి రూ.900 వరకు ఉంది. అయినా కూడా మాంసాహారులు ఏ మాత్రం వెనుకాడకుండా కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. సికింద్రాబాదు, రాంనగర్, జియాగూడ, మోండా మార్కెట్ లో ఫిష్ విక్రయం కూడా భారీగానే జరిగినట్లు సమాచారం. 2 వేల క్వింటాళ్ల వరకు అమ్ముడు పోయినట్లు వ్యాపారస్తులు వెల్లడించారు.

కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెబుతూ అర్థరాత్రి 12 గంటల వరకు పిల్లలు, పెద్దలు, యువత, కుటుంబ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ఇక నగరంలో హూటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్లులు, పబ్‌లలో ప్రత్యేక ఏర్పాటు నిర్వహించారు. రికార్డు డ్యాన్సులు, పాటలతో నూతన సంవత్సరానికి కేక్ లు కట్ చేసి స్వాగతం పలికారు.

Tags

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×