Sama Rammohan Reddy: తెలంగాణ కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్లో ‘జనసేన’ పార్టీ పెట్టిన పవన్, తెలంగాణకు వచ్చేసరికి బీజేపీకి వంగిపోతూ ‘భజనసేన’గా మారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రాల సరిహద్దులు మారగానే పవన్ సిద్ధాంతాలు కూడా ఎలా మారిపోతాయని రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై పోరాడుతానని చెబుతున్న పవన్ కళ్యాణ్కు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల పెరుగుతున్న ధరలు, దేశవ్యాప్తంగా వస్తున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు ఎందుకు కనిపించడం లేదని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్నా, వాటిపై ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్కు కాళ్లు లేవడం లేదా అని ఘాటుగా విమర్శించారు. పొరుగు రాష్ట్రంలో ఒకలా, ఇక్కడ ఇంకోలా వ్యవహరించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
తెలంగాణ సమాజం అమాయకమైనది కాదని, తప్పుడు రాజకీయాలను ఉపేక్షించదని ఆయన హెచ్చరించారు. ‘ఇది తెలంగాణ జాతి.. ప్రేమగా చూస్తే అమ్మలా ఆదరించడం తెలుసు.. అదే సమయంలో కుట్రలతో వస్తే అమ్మోరులా దహించివేయడమూ తెలుసు’ అంటూ పవన్ కళ్యాణ్ తీరుపై సామ రామ్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Also Read: ఆక్రమణ నిరూపిస్తే ప్రభుత్వానికే రాసిచ్చేస్తా.. రేవంత్ సర్కార్కు పవన్ కళ్యాణ్ సవాల్!