Sangareddy News: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భారీగా గంజాయిని పట్టుకున్నారు SOT పోలీసులు. పటాన్చెరు సమీపంలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేస్తున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు అక్కడ నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా వస్తున్న ఒక డీసీఎం వ్యాన్, ఒక కారును ఆపి తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ తనిఖీల్లో సుమారు 92కేజీల గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో లక్షల్లో ఉంటుందని అంచనా.. ఈ గంజాయిని ఒరిస్తా రాష్ట్రం నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్కు తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పోలీసుల కళ్లు కప్పి గంజాయిని తరలించేందుకు నిందితులు డీసీఎం వ్యాన్ను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన గంగారాం, మహేష్, విజయ్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద గంజాయితో పాటు డీసీఎం వ్యాన్, కారు, 11వేల రూపాయల నగదు పోలీసులు సీజ్ చేశారు.
ALSO READ:16 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వీ-సి 62