E-Paper
Advertisement

Tragic Saudi Bus Accident: 45 మంది మృతి.. ఒకే కుటుంబంలో 18 మంది బలి.. మహేష్ కుమార్ గౌడ్ పరామర్శ

Tragic Saudi Bus Accident: 45 మంది మృతి.. ఒకే కుటుంబంలో 18 మంది బలి.. మహేష్ కుమార్ గౌడ్ పరామర్శ

Tragic Saudi Bus Accident: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ దురదృష్టకర ఘటనలో మొత్తం 45 మంది యాత్రికులు మరణించినట్లు హజ్ కమిటీ అధికారికంగా ధృవీకరించింది. ఈ ప్రమాదంలో మరణించిన 45 మందీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరవాసులేనని హజ్ కమిటీ స్పష్టం చేసింది. ఈ వార్తతో హైదరాబాద్లో , మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ ప్రమాదం హైదరాబాద్‌లోని ఒక కుటుంబాన్ని పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది. మృతుల్లో 18 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండటం కన్నీరు పెట్టిస్తోంది. హైదరాబాద్, విద్యానగర్‌కు చెందిన నసీరుద్దీన్ కుటుంబం ఈ ప్రమాదంలో చిక్కుకుంది. నసీరుద్దీన్‌తో పాటు ఆయన కుమారుడు, కుమార్తెలు, కోడళ్లు, వారి పిల్లలతో సహా మొత్తం 18 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

ఈ ఘోర విషాదం నుంచి నసీరుద్దీన్ కుటుంబంలో సిరాజుద్దీన్ ఒక్కరే మిగిలినట్లు సమాచారం. నసీరుద్దీన్ కుమారుడైన సిరాజుద్దీన్, ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటుండటంతో ఈ యాత్రకు వెళ్లలేదు. ఇప్పుడు ఆ కుటుంబంలో అతను ఒక్కడే మిగలడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఈ హృదయ విదారక ఘటన గురించి తెలిసిన వెంటనే, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. హైదరాబాద్-విద్యానగర్‌లోని నసీరుద్దీన్ నివాసానికి వెళ్లి, వారి బంధువులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సౌదీలో మృత్యు వాత పడ్డ విద్యానగర్ కి చెందిన వారి పేర్లు:

నసీరుద్దీన్, ఉమ్మేజా, మణియం ఫాతిమా, SK జైనద్దీన్, మెహరీష్, మహమ్మద్, రిదా తజీన్, ఉజ్జైరుద్దీన్, అక్బర్ బేగం,  ఆసిన్ ఫాతిమా, అమీనా బేగం, సారా బేగం, సబానా బేగం, సుబేషా జాఫర్, రిజ్వానా బేగం, సలాఉద్దీన్, ఫరానా సుల్తానా, తాసిమా తహ్రీన్.

Read Also: Telangana Cabinet: సౌదీ బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల పరిహారం.. అక్కడికే ప్రభుత్వ ప్రతినిధి బృందం

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×