E-Paper
Advertisement

Tragic Saudi Bus Accident: 45 మంది మృతి.. ఒకే కుటుంబంలో 18 మంది బలి.. మహేష్ కుమార్ గౌడ్ పరామర్శ

Tragic Saudi Bus Accident: 45 మంది మృతి.. ఒకే కుటుంబంలో 18 మంది బలి.. మహేష్ కుమార్ గౌడ్ పరామర్శ

Tragic Saudi Bus Accident: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ దురదృష్టకర ఘటనలో మొత్తం 45 మంది యాత్రికులు మరణించినట్లు హజ్ కమిటీ అధికారికంగా ధృవీకరించింది. ఈ ప్రమాదంలో మరణించిన 45 మందీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరవాసులేనని హజ్ కమిటీ స్పష్టం చేసింది. ఈ వార్తతో హైదరాబాద్లో , మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ ప్రమాదం హైదరాబాద్‌లోని ఒక కుటుంబాన్ని పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది. మృతుల్లో 18 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండటం కన్నీరు పెట్టిస్తోంది. హైదరాబాద్, విద్యానగర్‌కు చెందిన నసీరుద్దీన్ కుటుంబం ఈ ప్రమాదంలో చిక్కుకుంది. నసీరుద్దీన్‌తో పాటు ఆయన కుమారుడు, కుమార్తెలు, కోడళ్లు, వారి పిల్లలతో సహా మొత్తం 18 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

ఈ ఘోర విషాదం నుంచి నసీరుద్దీన్ కుటుంబంలో సిరాజుద్దీన్ ఒక్కరే మిగిలినట్లు సమాచారం. నసీరుద్దీన్ కుమారుడైన సిరాజుద్దీన్, ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటుండటంతో ఈ యాత్రకు వెళ్లలేదు. ఇప్పుడు ఆ కుటుంబంలో అతను ఒక్కడే మిగలడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఈ హృదయ విదారక ఘటన గురించి తెలిసిన వెంటనే, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. హైదరాబాద్-విద్యానగర్‌లోని నసీరుద్దీన్ నివాసానికి వెళ్లి, వారి బంధువులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సౌదీలో మృత్యు వాత పడ్డ విద్యానగర్ కి చెందిన వారి పేర్లు:

నసీరుద్దీన్, ఉమ్మేజా, మణియం ఫాతిమా, SK జైనద్దీన్, మెహరీష్, మహమ్మద్, రిదా తజీన్, ఉజ్జైరుద్దీన్, అక్బర్ బేగం,  ఆసిన్ ఫాతిమా, అమీనా బేగం, సారా బేగం, సబానా బేగం, సుబేషా జాఫర్, రిజ్వానా బేగం, సలాఉద్దీన్, ఫరానా సుల్తానా, తాసిమా తహ్రీన్.

Read Also: Telangana Cabinet: సౌదీ బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల పరిహారం.. అక్కడికే ప్రభుత్వ ప్రతినిధి బృందం

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×