E-Paper
Advertisement

SBI: ఎస్‌బీఐ సర్వర్‌ డౌన్‌.. ఈ బ్యాంక్ ఇక మారదా?

SBI: ఎస్‌బీఐ సర్వర్‌ డౌన్‌.. ఈ బ్యాంక్ ఇక మారదా?
Advertisement
sbi

SBI: మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే ఆ కష్టాలు ఎలా ఉంటాయో మీకు బాగా తెలిసే ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్ కస్టమర్లు నమ్మకపోవచ్చు కానీ.. ఎస్బీఐ ఆన్‌లైన్ ట్రాన్జాక్షన్స్ ఎంతగా వేధిస్తుంటాయో బాధితులకే తెలుసు. కార్డు స్వైప్ చేస్తే సర్వర్ డౌన్ అంటుంది. యూపీఐ పేమెంట్ చేద్దామంటే సర్వర్ నాట్‌వర్కింగ్ అని హ్యాండ్ ఇస్తుంది. ఇలా అప్పుడప్పుడు కాదు.. ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎస్బీఐ ఖాతాదారులకు ఓపికెక్కువ ఉండాలి.

అసలే ఏప్రిల్ ఫస్ట్. కొత్త ఫైనాన్సియల్ ఇయర్ స్టార్టింగ్. బ్యాంకులు అన్‌అఫిషియల్‌గా మూతపడ్డాయి. ఆన్‌లైన్ సేవలూ నిలిచిపోయాయి. ఏదో ఏప్రిల్ 1 కాబట్టి ఇలా ఉందిలే.. మర్నాటికల్లా అంతా సెట్ అవుతుందిలే అనుకుంటే.. ఆదివారమూ సర్వర్ పని చేయలేదు. కనీసం మండే నుంచైనా నో ప్రాబ్లమ్ అనుకుంటే.. సోమవారమూ ఎస్బీఐ సర్వర్ సతాయించింది. తరుచూ మొండికేస్తోంది. దీంతో, సోషల్ మీడియా వేదికగా కస్టమర్లు ఎస్బీఐని కామెంట్లతో కుళ్లబొడుస్తున్నారు. ఆన్‌లైన్ సేవలు వర్క్ అవట్లేదంటూ తెగ పోస్టులు పెడుతున్నారు.

Advertisement

యూపీఐ లావాదేవీలు, నెట్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌.. ఇలా SBIకి చెందిన అన్నిరకాల ప్లాట్‌ఫామ్స్‌లోనూ సమస్యలు వస్తున్నట్టు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.

ఏప్రిల్‌ ఒకటో తేదీన ఆన్‌లైన్‌ సేవలకు అధికారికంగా స్వల్ప విరామం ప్రకటించింది ఎస్బీఐ. ఆ రోజు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యోనో లైట్‌, యోనో బిజినెస్‌, యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేసింది. వార్షిక ఖాతాల ముగింపు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయితే, ఆ తర్వాత కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవలేదు. ఎస్బీఐ సేవల్లో పలు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా తెగ వర్రీ అవుతున్నారు యూజర్లు. ఇంత జరుగుతుంటే.. SBI మాత్రం తనకేం తెలీనట్టు స్పందించట్లేదు. ప్రభుత్వ బ్యాంకా.. మజాకా!

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×