E-Paper
Advertisement

Secunderabad Tragedy: చంపేసిన చపాతీ.. తింటూ తింటూనే బాలుడు మృతి.. అసలేం జరిగిందంటే?

Secunderabad Tragedy: చంపేసిన చపాతీ.. తింటూ తింటూనే బాలుడు మృతి.. అసలేం జరిగిందంటే?
Advertisement

Secunderabad Tragedy: మీ పిల్లలు చపాతీ తింటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. పెద్దల సమక్షంలో పిల్లలు చపాతీ తినాల్సిన రోజులు వచ్చాయి. ఓ బాలుడు దురదృష్టవశాత్తు చపాతీ తిని మృత్యు ఒడిలోకి చేరాడు. అందుకే మీ పిల్లలు చపాతీ తినే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. ఇంతకు ఆ విద్యార్థి ఎలా మృతి చెండాదంటే..

సికింద్రాబాద్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ లో విరల్ జైన్ అనే బాలుడు ఆరవ తరగతి విద్యను అభ్యసిస్తున్నాడు. రోజువారి మాదిరిగానే బడికి వచ్చి చదువుకున్నాడు. మధ్యాహ్నం అయింది. తన క్యారేజ్ తీసుకొని తినేందుకు కూర్చున్నాడు. తోటి విద్యార్థులు కూడా అలాగే కూర్చొని తినడం ప్రారంభించారు. విరల్ జైన్ కూడా తన క్యారేజ్ ఓపెన్ చేసి, చపాతీ తినడం ప్రారంభించాడు. చపాతీ అంటే చపాతీ రోల్ తీసుకొని నోటిలో పెట్టుకున్నాడు.

Advertisement

అలా కాస్త తిన్నాడు. మరలా కాస్త ఆరగించాడు. ఇక అంతే ఊపిరి ఆడని పరిస్థితి. సక్రమంగా శ్వాస అందకపోవడంతో తన స్నేహితులకు తెలిపాడు. వారు హుటాహుటిన పాఠశాల ఉపాధ్యాయులకు తెలిపారు. ఉపాధ్యాయులు కూడా అసలేం జరిగిందంటూ ఉరుకులు, పరుగుల మీద అక్కడికి చేరుకున్నారు. చివరికి ప్రవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సమాయత్తమై స్పీడ్ గా జైన్ ను వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే ఊపిరి ఆడకుండా ఇబ్బందులు ఎదుర్కొన్న జైన్, పాపం మార్గమధ్యలోనే విలవిలలాడాడు. చివరికి తన ప్రాణాలు వదిలాడు.

Also Read: Ram Gopal Varma Case: వర్మ వెనక ఉన్న టాలీవుడ్ హీరో ఎవరు..? ఆ ఫామ్ హౌజ్ ఎక్కడ ఉంది..?

Advertisement

ఈ విషయం తెలుసుకున్న జైన్ కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున వైద్యశాల వద్దకు చేరుకున్నారు. తమ కన్నకొడుకు మృతి చెందడంతో అతని తల్లి రోదనలు మిన్నంటాయి. అలాగే విరల్ జైన్ ఫ్రెండ్స్, టీచర్స్ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. చపాతీ రోల్ నోటిలో పెట్టుకున్న సమయంలో గొంతులో ఇరుక్కు పోవడంతో జైన్ మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. తన బిడ్డ సాయంత్రం పాఠశాల నుండి వస్తాడని ఎదురు చూపుల్లో ఉన్న అతని తల్లిదండ్రులు విషాదంలో మునిగి పోయారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×