E-Paper
Advertisement

Kamareddy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. కాలువలో పడి పసివాడు మృతి..

Kamareddy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. కాలువలో పడి పసివాడు మృతి..

Kamareddy : బడికి వెళ్ళాను అని మారం చేసే చిన్న పిల్లలను తల్లిదండ్రులు బుజ్జగించి బడికి పంపుతారు. బడి నుంచి ఇంటికి వచ్చే సమయానికి పిల్లల కోసం తల్లులు గుమ్మం దగ్గర ఎదురు చుస్తూ కుర్చుంటారు. అలాంటి తల్లికి తన కుమాారుడు తిరిగి రాకపోతే ఎంతో విలవిలలాడి పోతుంది. ఇలాంటి ఘటన ఓ తల్లికి ఎదురుయ్యింది.తన కుమారుడిని చక్కగా ముస్తాబు చేసి బడికి పంపించింది.చిరునవ్వుతో రావాలసిన ఆ బాబు శవమై వచ్చాడు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తబాదిలో విషాద ఘటన చోటు చేసుకుంటుంది. బడి వద్ద ఆడుకుంటూ బయటకు వెళ్లిన ఓ విద్యార్థి కాలువలో పడి మృతి చెందాడు . కొత్తబాది ప్రాథమిక పాఠశాలలో ఫర్హాన్‌ (6) అనే బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనం అనంతరం తోటి విద్యార్థులతో ఆడుకుంటూ పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో బయటకు వచ్చాడు.

కాలు జారి పక్కనే ఉన్న కాలువలో పడ్డాడు. వెంటనే తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు, తల్లి అసిఫాకు సమాచారం ఇచ్చారు. స్థానికులు ఫర్హాన్‌ను వెంటనే కాలువ నుంచి బయటికి తీసి.. బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఫర్హాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఫర్హాన్ బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. గతంలో పాఠశాలకు ప్రహరీ ఉండగా పక్కన ఉన్న ప్రాథమిక సహకార సంఘం గోదాం నిర్మాణం కోసం దాన్ని తొలగించారు. గుత్తేదారు ప్రహరీ గోడ నిర్మిస్తానని హామీ ఇచ్చి ఇప్పటికీ నిర్మించలేదని స్థానికులు మండిపడ్డారు.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×