E-Paper
Advertisement

కొంపల్లిలో పేకాట స్థావరంపై SOT దాడి.. మాజీ చైర్మన్‌తో సహా 8 మంది అరెస్ట్!

కొంపల్లిలో పేకాట స్థావరంపై SOT దాడి.. మాజీ చైర్మన్‌తో సహా 8 మంది అరెస్ట్!
Advertisement

Gambling Den: స్వేచ్ఛ బ్యూరో: కొంపల్లిలో పేకాట స్థావరంపై కుత్బుల్లాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అపర్ణ సరీనిటీ అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్‌ మాజీ డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

రెండోసారి పట్టుబడ్డారంటూ..

Advertisement

పేకాట ఆడుతూ దేవేందర్‌రెడ్డి పోలీసులకు పట్టుబడటం ఇది రెండోసారి అని సమాచారం. గతంలోనూ పేకాట వ్యవహారంలో ఆయన పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. తాజాగా మరోసారి పేకాట ఆడుతున్న సమయంలో ఎస్‌ఓటీ పోలీసుల దాడిలో పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.

రూ.3.28 లక్షలు స్వాధీనం

Advertisement

దాడిలో పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.3,28,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పేకాటకు ఉపయోగించిన పేకముక్కలు, సెల్‌ఫోన్లు తదితర సామగ్రిని సీజ్‌ చేశారు. పట్టుబడిన ఎనిమిది మందిపై గేమింగ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎవరి అండతో నిర్వహణ?

అపార్ట్‌మెంట్‌లో పేకాట స్థావరం నిర్వహిస్తున్న విషయం స్థానికులకు తెలియకుండా ఎలా కొనసాగింది? ఇందులో నిర్వాహకుల పాత్ర ఏమిటి? పేకాట కోసం ప్రత్యేకంగా అపార్ట్‌మెంట్‌ను ఉపయోగిస్తున్నారా? అన్న కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పేకాట నిర్వహణ వెనుక మరెవరైనా ఉన్నారా? అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.పేకాట, జూద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Also Read: దేవరయాంజాల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 6 గంటలుగా ఎగిసిపడుతున్న మంటలు, కోట్ల ఆస్తి నష్టం!

Tags

Related News

కేపీహెచ్‌బీలో ఇందిరమ్మ టవర్స్‌కు రేపే శంకుస్థాపన.. డిఫాల్ట్ మిల్లర్లపై సీఎం రేవంత్ ఫైర్!

దేవరయాంజాల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 6 గంటలుగా ఎగిసిపడుతున్న మంటలు, కోట్ల ఆస్తి నష్టం!

పింఛన్‌దారులకు శుభవార్త! పాత నిబంధనలతోనే కొత్త పింఛన్లు..

హైటెక్ సిటీలో భారీ మాల్.. షాపింగ్, థియేటర్లు, రెస్టారెంట్లు అన్నీ ఒకే చోట.. సరికొత్త వీకెండ్ డెస్టినేషన్!

ఎల్బీ‌నగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. అసలే ఏం జరిగింది? కుటుంబసభ్యుల ఆందోళన

నియోపోలిస్ ప్లాట్ 17 మళ్ళీ వేలం, చేతులెత్తేసిన వజ్ర కన్స్ట్రక్షన్స్, అప్పట్లో ఎకరా రూ.136 కోట్లకు కొనుగోలు

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, హైదరాబాద్‌లో అయితే..

Big Stories

Advertisement
×