E-Paper
Advertisement

Siricilla News: సిరిసిల్ల సెస్ కార్యాలయంలో శ్రీ హంపి విరుపాక్ష విద్యారణ్య స్వామి పూజలు..

Siricilla News: సిరిసిల్ల సెస్ కార్యాలయంలో శ్రీ హంపి విరుపాక్ష విద్యారణ్య స్వామి పూజలు..
Advertisement

Siricilla News: సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు  కలకలం రేపాయి. సెస్ కార్యాలయ ప్రాంగణంలోని క్యాష్ సెక్షన్ గదిలో బుధవారం శ్రీ హంపి విరుపాక్ష విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి.

పూజ అనంతరం స్వామీజీ సెస్ కార్యాలయం వాస్తుకు లోపం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా చైర్మన్ కుర్చీలో కూర్చుని అధికారులకు ఉద్యోగులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యాలయం వాస్తు లోపాలు సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. స్వామీజీ చైర్మన్ కుర్చీలో కూర్చొని మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

సెస్ కార్యాలయంలో స్వామీజీ పూజలు నిర్వహించడంపై రాష్ట్రంలో భిన్న చర్చలు సాగుతున్నాయి. ఇటివల సెస్ కార్యాలయంలో వరుస తనిఖీలు, విజిలెన్స్ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు తనిఖీల నేపథ్యంలో సంస్థలో నెలకొన్న అశాంతి నివారణకు, కార్యాలయానికి శాంతి చేకూరడం కోసం ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బయట గుసగుసలు వినిపిస్తున్నాయి. సెస్ అధికారులే ఈ పూజలు చేయించారనే ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రత్యేక పూజకు కొందరు సెస్ డైరెక్టర్లు హాజరు కాలేదు. ముఖ్యమైన డైరెక్టర్లు గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై డైరెక్టర్లలో లోలోపల అసంతృప్తి ఉందనే వార్తలకు ఇది బలం చేకూర్చుతోంది. పూజ నిర్వహణ దాని ఉద్దేశంపై కూడా డైరెక్టర్ల మధ్య ఏకాభిప్రాయం లేదనే చర్చ నడుస్తోంది. ఏదేమైనా సెస్ కార్యాలయంలో స్వామీజీ పూజలు వాస్తు సూచనలు జిల్లాలో ప్రధాన వార్తగా మారాయి.

Advertisement

ALSO READ: BC Reservations: బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోం.. మరో భారీ ఉద్యమం చేయాల్సిందే.. ఆర్ నారాయణ మూర్తి మాస్ వార్నింగ్

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×