Sridhar Babu: అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై జరిగిన చర్చల్లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి కలిగే నష్టంపై లోతైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రకృతి వనరులను కాపాడుకుంటేనే ఆర్ధిక పురోగతి సాధించేలా పారిశ్రామిక విధానాలు రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
జపాన్ లోని మినమాటా తరహా విషాదం హైదరాబాద్కు రాకూడదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామిక వ్యర్ధాల వల్ల మూసీ నది, భూగర్భ జలాలు కలుషితమై నల్గొండ, జంట నగరాల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. తక్షణమే మేల్కోకపోతే హైదరాబాద్ ఢిల్లీలా మారుతుందని భావితరాలకు జన్యుపరమైన ముప్పు పొంచి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
అదేవిధంగా ఐడీపీఎస్(IDPL)రాకతో హైదరాబాద్లో.. పారిశ్రమానిక ప్రస్థానం మొదలైందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సనత్ గనర్,ఉప్పల్ జీడిమెట్ల, చెర్లపల్లి వంటివి ఇండస్ట్రియల్ జోన్స్ గా ప్రకటించారు. నగర శివారులోని జనసంచారం లేని ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేశారు. గత 50 ఏళ్లలో హైదరాబాద్ ఊహించని విధంగా విస్తరించింది. అప్పుడు ఇండస్ట్రియల్ జోన్స్.. నేడు లక్షలాది మంది నివసించే రిసిడెన్షియల్ కాలనీలుగా మారిపోయాయి అని చెప్పారు.
Also Read: గుండెపోటు కాదు.. 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం భర్తను కడతేర్చిన భార్య
కాదా అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు.. గత పారిశ్రామిక విపత్తులను గుర్తుచేశారు. భోపాల్ గ్యాస్ దురంతం, విశాఖ ఎల్జీపాలిమర్స్, మినామాటా వంటి ఘటనలు బఫర్ జోన్లు లేకపోవడం వల్లే జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల్లో పరిశ్రమల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని, అలాంటివి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే పర్యావరణ పరిరక్షణతో కూడిన సుస్థిర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.