Liquor Smuggling: స్వేచ్ఛ బ్యూరో: ఆంద్రా మద్యం తెలంగాణ లోకి ఎలా వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడారు. ఎక్సయిజ్ శాఖ మంత్రి దగ్గర ఓ ఎస్ డీ గా ఉన్న రిటైర్డ్ అధికారి అవినీతి కి అంతే లేదని ఆరోపించారు. కూకట్ పల్లిలో ఓ వైన్ షాప్ లో ఆంధ్రా మద్యం దొరికింది. ఆ మద్యాన్ని పట్టుకుని కొంత ఫైన్ వేసి లక్షల్లో లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఈ లంచం నేరుగా మంత్రి ఓ ఎస్ డీ కే వెళ్ళింది. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఈ అవినీతి ఇట్లా ఉంటె ఆంధ్రా అధికారుల పెత్తనం మరో వైపు తెలంగాణ ఉద్యోగుల పట్ల శాపం లా మారుతోందన్నారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల ఆంధ్రా అధికారుల వైఖరి మారక పోతే మరో ఉద్యమం వస్తుందని హెచ్చరించారు.
తెలంగాణ లో నీళ్లు ,నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతోందన్నారు. ఆంధ్రా నుంచి వచ్చి రావడం తోనే ఓ అధికారికి ఎక్సయిజ్ శాఖ కమిషనర్ పదవి ఇచ్చారన్నారు. ఆంధ్రా అధికారులకు కీలక పోస్టింగ్ లు ఇచ్చి తెలంగాణ అధికారులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఆ ఆంధ్రా అధికారి తీరు వల్ల తెలంగాణ అధికారుల ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు గుండె పోట్లు వస్తున్నాయని, బీసీ ,ఎస్సీ ,ఎస్టీలను కులం పేరుతో ఆ అధికారి దూషిస్తున్నాడన్నారు. సోమిరెడ్డి అనే సిన్సియర్ అధికారి ఆ ఆంద్రా అధికారి తిట్లకు కుప్ప కూలిపోయాడని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు.
Also Read: డైటింగ్ చేస్తున్నా.. బరువు తగ్గకపోవడానికి గల అసలు కారణాలు ఇవే!
తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఆంధ్రా ఉద్యోగుల పెత్తనం ఏమిటని నిలదీశారు. ఆంధ్రా అధికారి బూతులతో ఇక తాను ఉద్యోగం చేయనని సోమిరెడ్డి ఆత్మగౌరవం ప్రదర్శించారన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తీస్తున్న ఆంధ్రా అధికారులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఉద్యోగులను వేధించిన ఎక్సయిజ్ కమిషనర్ హరి కిరణ్ ను తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఏసీబీ తిమింగలాలను వదిలేసి చిరు ఉద్యోగుల మీద పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని, సోమిరెడ్డి కి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే భాద్యత అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ,కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ ,వాల్య నాయక్ ,రామచంద్ర నాయక్ ,సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ పాల్గొన్నారు.
Also read:ఈ కేసుతో నాకు సంబంధం లేదు… మంగ్లీ వివాదంపై డైరెక్టర్ క్లారిటీ!