Srinivas Goud: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో తోపులాట కారణంగా 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికితీయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. డీజీపీ శివధర్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రకుల నాయకుడు రజక కులానికి చెందిన రెండు నెలల పసికందును తన్ని చంపినా వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: TG Ed.CET 2026: తెలంగాణ ఎడ్సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్,ఉపేందర్ చారి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజు యాదవ్, నేతలు స్వామి యాదవ్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.