E-Paper
Advertisement

Summer Alert by IMD : రోహిణికి ముందే రోళ్లు పగిలే ఎండలు.. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

Summer Alert by IMD : రోహిణికి ముందే రోళ్లు పగిలే ఎండలు.. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక
Advertisement
summer effect in telugu states
summer effect in telugu states

Summer Alert for Telugu States(Today weather report telugu): శివరాత్రి రాకముందే తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. నడినెత్తిన సూర్యుడు మాడు పగలకొడుతున్నాడు. ఉదయం 9 నుంచే ఎండ సుర్రుమంటోంది. చలి తగ్గి మార్చి మొదటివారంలోనే దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలే కాదు.. రాత్రి వేళల్లోనూ ఇప్పటి నుంచే ఉక్కపోతగా ఉంటోంది. చలిగాలి కాదు కదా. నిన్న ఏకంగా 37 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉక్కపోత, భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read More : శ్రీకాళహస్తి ఆలయంపై డ్రోన్ కలకలం.. గెస్ట్ హౌస్ లో ఉన్న ఐదుగురు కలిసి..

Advertisement

ఇక తెలంగాణలో రానున్న 5 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని తెలిపింది. నిన్న రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటాయి. విజయవాడలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా సిద్దిపేట, నల్గొండ, వనపర్తిలో 39 డిగ్రీలు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, ఖమ్మం, ములుగులో 38.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. హైదరాబాద్ లోని మోండా మార్కెట్, సరూర్ నగర్, లంగర్‌ హౌజ్ లో 38 డిగ్రీలు దాటింది. ఈ లెక్కన మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది మార్చి నెలలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే.. ఈ ఏడాది మార్చి3నే 37 డిగ్రీల ఉష్ణోగ్రత దాటడం గుండెల్లో గుబులు రేపుతోంది.

ఎండలు మండిపోతుండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గురువారం (మార్చి 7) వరకు ఎండల తీవ్రత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లకూడదని, ఏమైనా పనులు ఉంటే ఉదయం, సాయంత్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో మే వరకు వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం అత్యంత తీవ్రమైన వేసవిగా నమోదు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 10 సార్లైనా వడగాలులు వీస్తాయని అంటున్నారు. మజ్జిగ, మంచినీళ్లు, శరీరానికి చలువచేసే ఇతర పానీయాలను తరచుగా తాగాలని సూచిస్తున్నారు.

Tags

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×