E-Paper
Advertisement

Summer : మండుతున్న సూర్యుడు.. తెలుగు రాష్ట్రాల్లో అల్లాడుతున్న జనం..

Summer : మండుతున్న సూర్యుడు.. తెలుగు రాష్ట్రాల్లో అల్లాడుతున్న జనం..
Advertisement

Summer : తెలుగురాష్ట్రాల్లో భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటిపూట 40 నుంచి 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే… మే నెలలో ఇంకా ఎండలు ఎంత పెరుగుతాయో అని జనం భయపడుతున్నారు.

తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది.

Advertisement

APలోని దక్షిణ కోస్తాలో ఎండలు ఎక్కువగా ఉంటాయని, చాలా ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ జిల్లాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

వడగాల్పులతోపాటు ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ ప్రభావంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లపై జనసంచారం బాగా తగ్గిపోయింది. అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలు బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. వడదెబ్బబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×