Job Termination: మేడ్చల్లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ధర్నాకు దిగిన సంఘటన సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. తనను అకారణంగా జాబ్లో నుంచి తీసివేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పాపకు ఆరోగ్యం బాగాలేదని 3 రోజులు సెలవు కావాలని కోరితే నన్ను ఉద్యోగంలోనుండి తీసేసారని భావన అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
Also read: Tirumala Theft: తిరుమల విగ్రహం చోరి కేసులో బిగ్ ట్విస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు!
ఇంతకు ముందు ఆరోగ్యం బాగాలేక కంపెనీలో పడిపోతే కనీసం నన్ను పట్టించుకోలేదని తెలిపింది. గతంలో 14 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సమయంలో కూడా నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరించారని యాజమాన్యంపై భావన అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. కావాలనే నన్ను ఉద్దేశపూర్వకంగానే జాబ్లో నుంచి తీసేశారని దుండిగల్ పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు చేసింది. అనంతరం తనకు న్యాయం కావాలని కంపెనీ ముందు భావన ధర్నాకు దిగింది.
'కారణం లేకుండా జాబ్ నుండి తొలగించారు'
కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారని టెక్ మహీంద్రా కంపెనీపై భావన అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు, తన పాపకు అనారోగ్యంగా ఉండి సెలవు పెడితే, త్వరగా రావాలని వేధించి చివరకు జాబ్ నుండి తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. వాష్రూమ్కు… pic.twitter.com/xoim05HblC
— BIG TV Breaking News (@bigtvtelugu) July 23, 2026
Alao Read: Gadwal: గద్వాల్లో మళ్లీ మొదలైన బుల్డోజర్ల హడావుడి..!