Medak District: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల ను గుర్తించడానికి కే. కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని నియమించడం జరిగింది. మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం కోసం రేపు సాయంత్రం ఐదు గంటలకు టీఎన్జీవో భవన్ మెదక్లో సమావేశాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడంలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారిని, శారీరక వికలాంగులైన వారిని, కేసులు నమోదైన వారిని, జైలు నిర్బంధించబడిన వారిని,
రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని తెలంగాణ సాధించుకున్నారు. మెదక్ జిల్లాలో జరిగిన అన్ని కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొన్న వారందరిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని రేపు జరిగబొయే సమావేశంలో మెదక్ మండలం మరియు పట్టణం హవేలీ గణపురం పాపన్నపేట కొల్చారం వెల్దుర్తి మండలాలలో పనిచేసిన ఉద్యమకారులందరూ పాల్గొనాలని తెలిపారు.
Also Read: తమిళనాడులో అన్నామలై.. తెలంగాణలో పవన్ కళ్యాణ్! మోడీ కొత్త మంత్రం..!
10 తేదీ సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో జరిగే సమావేశంలో అందరు పాల్గొనవలసిందిగా మెదక్ జిల్లా ఉద్యమ జేఏసీ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. సడిమెల యాదగిరి, బి కొండల్ రెడ్డి. శంకర్ దయాల్ చారి, బొందుగుల నాగరాజు, పీడీ ఆనందం, భూపాల్ రెడ్డి, కుమార్ మామిడి, బొమ్మల మైసయ్య, ఆకుల పెంటయ్య, కంది శ్రీనివాస్ రెడ్డి, సత్యం మనోహర్ రెడ్డి తదితర నాయకులు పాల్టోని మాట్లాడారు.
Also Read: ఇలాంటి ఇల్లు ఉంటే.. లైఫ్లో ఏసీ, కూలర్ అక్కర్లేదు.. 40 ఏళ్లుగా 10°C ఉష్ణోగ్రత!