Revanth Reddy: బీజేపీ సభ్యులు చీకటి మిత్రులను కాపాడడానికి సహాయం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సభ గౌరవాన్ని నిలబెట్టుకునే బాధ్యత మనమీదే ఉంటుంది. స్పీకర్ గా మీకు అవమానం జరిగింది. సభాపతిగా మీ గౌరవం కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే దే అని అన్నారు. సభాపతి మీద ఇష్టానుసారంగా అసభ్యంగా మాట్లాడారని, బీజేపీ ఎమ్మెల్యేలు సభలో కూర్చుంటున్నారు. బిఆర్ఎస్ చేసిన తప్పును మీరెందుకు మోస్తున్నారుని సీఎం రేవంత్ అన్నారు. స్పీకర్కి అవమానం జరిగితే మనకు, తెలంగాణ ప్రజలకు జరిగినట్లేనని అన్నారు.
నిన్న ఫామ్ హౌస్లో సమావేశం ఏర్పాటు చేసి నేతలను ఉసిగొల్పి, ఉరిగొల్పి పంపారు. మా అందరికి సమానమైన సభాపతి మీరు. దళితులను మోసం చేసిన ఘనత బిఆర్ఎస్ది ఉప ముఖ్యమంత్రిని సైతం బర్తరఫ్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గతంలో దళితులకు ప్రోటోకాల్ లేకుండా అవమానించారు. ప్రతిపక్ష నాయకుడు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని సభకు రాను అన్నారు. స్వయ నియంత్రణ ఏర్పాటు చేసుకుందామని అన్నారు. సభాపతికి అవమానం జరిగితే మా అందరికి అవమానం జరిగినట్టేనని సీఎం అన్నారు.
Also read: టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!
సభలో మీరు ప్రశ్నించండి.. మేము సమాధానం చెపుతాం, రాజకీయాలకు అతీతంగా మనం ముందుకు వెళ్ళాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరికి మైక్ ఇస్తా.. మీ అభిప్రాయాలు మాట్లాడండి. రేపటి నుండి సమస్యలపై చర్చిద్దామని, స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ రాష్ట్రంలో ఇలా జరగలేదని సీఎం ఫైర్ అయ్యారు. మేము సమన్వయం ఉంటే చేతగాని తనంగా భావిస్తున్నారు. మధు చేసిన స్పీకర్ పై వ్యాఖ్యలపై కెసిఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తాత మధు సభ్యత్వం రద్దు చెయ్యలన్నారు. అడ్డగోలు తనం.. ఎం మాట్లాడుతున్న చెల్లుతుంది అనుకోవడం సరికాదని, అన్ని చట్టసభల్లో పని చేసిన సభ్యునిగా పనిచేసిన అనుభవం నాకుంది.. ఏ చట్టసభల్లో ఇలా జరగలేదని సీఎం రేవంత్ తెలిపారు. ఇలాంటి సంప్రదాయం సరికాదని సభ తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే కెసిఆర్ క్షమాపణ చెప్పి, రాజీనామా చేపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Also read: స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!