E-Paper
Advertisement

Covid 19 in Telangana: తెలంగాణలో తొలి కోవిడ్ కేసు నమోదు.. ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలోనే!

Covid 19 in Telangana: తెలంగాణలో తొలి కోవిడ్ కేసు నమోదు.. ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలోనే!
Advertisement

Covid 19 in Telangana: భారతదేశంలో మరోసారి కరోనా వైరస్ వణికిస్తోంది. ఈసారి కొత్త రూపంలో మ్యూటేషన్ అయిన వేరియంట్ ద్వారా వైరస్ వ్యాపిస్తోందని వైద్య వర్గాలు అంటున్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నందున, దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖలు మళ్లీ అప్రమత్తంగా మారాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదు కాగా, తాజాగా తెలంగాణలో కూడా తొలి కేసు బయటపడింది.

హైదరాబాద్‌లో తొలి కేసు నమోదు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో నివసించే ఓ వైద్యునికి కొత్త వేరియంట్ కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, పలువురు ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఇది నిజమేనని అంటున్నారు. డాక్టర్‌కు పాజిటివ్ వచ్చిందనే అనుమానంతో, అతని కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం.

Advertisement

ఏపీలో ముందే విజృంభణ ప్రారంభం
ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోనూ తన ఛాయలు విస్తరించింది. ముఖ్యంగా విశాఖపట్నంలో తొలి కేసు నమోదవ్వడం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేసింది. దీనితో తెలంగాణా, ఆంధ్రాలోని ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆరోగ్య అధికారులకు హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.

కొత్త వైరస్ ఎలా ఉంటుంది?
కొత్త కోవిడ్ వేరియంట్ ఇది సాధారణ కోవిడ్ కంటే వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు అంటున్నారు. లక్షణాలు చాలామందిలో తేలికపాటి జ్వరంగా ఉంటాయి. కొందరికి గొంతునొప్పి, దగ్గు, అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు, అధిక వయసు వారికి జాగ్రత్తలు అవసరమైన పరిస్థితి. అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం ఏమి లేదని వైద్యులు అంటున్నారు.

Advertisement

ప్రభుత్వ చర్యలు.. ముందస్తు తగిన ఏర్పాట్లు
బెంగళూరు, ముంబయి, కోల్‌కతా వంటి నగరాల్లో ఇప్పటికే వందల కేసులు నమోదవుతున్న సమయంలో, తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రత్యేకంగా.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఔట్‌ బౌండ్ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తుండగా, ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక ఐసొలేషన్ వార్డులు సిద్ధం చేశారు. కొత్త వేరియంట్ తక్కువ ప్రమాదం కలిగినదే అయినా, అది ఎక్కువ మందికి వేగంగా వ్యాపించగల సామర్థ్యం కలిగివుందని వైద్యులు చెబుతున్నారు.

Also Read: CM Revanth Reddy : మోదీతో కలిసి పనిచేస్తా.. సీఎం రేవంత్ సంచలనం

ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే..
బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలి. కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. కోవిడ్ మహమ్మారి గురించి ముందస్తు జాగ్రత్తలే మన ప్రాణాలను కాపాడతాయి. ఈ కొత్త వేరియంట్ వెలుగు చూసిన వేళ, మళ్లీ మునుపటి అలర్ట్ స్థితికి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ, నిర్లక్ష్యం వద్దు. ఇంట్లో వృద్ధులు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. స్కూల్స్, కాలేజీల్లోనూ మాస్క్, శానిటైజర్ వినియోగం పెరగాలి.

హైదరాబాద్‌లో నమోదైన తొలి కొత్త కోవిడ్ వేరియంట్ కేసు రాష్ట్రాన్ని మరోసారి అప్రమత్తం చేసింది. ఇది భయపడాల్సిన విషయమేం కాదు. కానీ అప్రమత్తతను పాటించాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, ఈ కొత్త వేరియంట్‌ను కూడా మనం కట్టడి చేయగలమని వైద్యులు అంటున్నారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×