BigTV English
Advertisement

Telangana Govt: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత.. నేడు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు..

Telangana Govt: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత.. నేడు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు..

Telangana Govt: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్య కారణంగా గురువారం రాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్తగా, ప్రధానిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణంగా మన్మోహన్ సింగ్ ను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించారు. చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు.


మన్మోహన్ సింగ్ మృతి వార్త తెలిసిన వెంటనే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అంతేకాకుండా పలు రాష్ట్రాలు సీఎంలు మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ తమ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి ఆర్థిక వేత్తను దేశం కోల్పోయిందని ఈ సందర్భంగా మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Also Read: Manmohan Singh Dead: మాజీ ప్రధాని మృతికి 7 రోజుల సంతాపం ప్రకటించిన కేంద్రం.. ప్రభుత్వ లాంఛనాలతో అంతక్రియలు


తెలంగాణలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల వారం రోజులపాటు సంతాపదినాలు పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నేడు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఇతర మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ లు మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు.

Related News

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×