E-Paper
Advertisement

Sabapathy Dekshinamurthy: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ డైరెక్టర్ కన్నుమూత..

Sabapathy Dekshinamurthy: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ డైరెక్టర్ కన్నుమూత..
Advertisement

Sabapathy Dekshinamurthy: తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ అయిన సభాపతి దక్షిణామూర్తి అలియాస్ ఎస్‌డీ సభా.. తన 61 ఏట అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సినిమాలను డైరెక్ట్ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు సభాపతి. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవల కన్నుమూశారు. దీంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా సభాపతి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. దర్శకుడిగా సభాపతి దక్షిణామూర్తి తెరకెక్కించిన సినిమాలు కొన్నే అయినా.. వాటిని ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా తెరకెక్కించి మంచి గుర్తింపు సాధించారు.

స్పీడ్ తగ్గింది

Advertisement

కోలీవుడ్‌లో సభాపతి దక్షిణామూర్తిని ఎస్‌డీ సభా, సభాపతి, సభా ఖైలాష్ అని కూడా పిలుచుకుంటారు. 1992లో ఆయన దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. విజయకాంత్ హీరోగా నటించిన ‘భారతన్’ అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయన ప్రయాణం మొదలయ్యింది. 1993లో ప్రశాంత్, శుభశ్రీ కాంబినేషన్‌లో ‘ఎంగ తంబి’ అనే మూవీని తెరకెక్కించారు. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన కొత్తలోనే సభాపతి నుండి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు రావడంతో ఆయన మిగతా కెరీర్ కూడా ఇలాగే స్పీడ్‌గా సాగిపోతుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ‘ఎంగ తంబి’ తర్వాత ఆయన మరొక చిత్రం తెరకెక్కించడానికి మూడేళ్లు పట్టింది.

Also Read: అల్లు అర్జున్ ఈగో.. సీఎం ముందు ఇండస్ట్రీ తలవంచేలా చేసింది

Advertisement

తెలుగులో కూడా

ఆరోజుల్లో ఉన్న చాలామంది దర్శకులలాగా కాకుండా కాస్త డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలని ప్రయత్నించేవారు సభాపతి దక్షిణామూర్తి. అందులో భాగంగానే ‘సుందర పురుషాన్’, ‘వీఐపీ’ లాంటి సినిమాలు తెరకెక్కించారు. అలా దర్శకుడిగా కెరీర్‌ను పూర్తిగా పక్కన పెట్టకుండా అవకాశం దొరికిన ప్రతీసారి తన సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నారు. అలా వరుసగా అరడజనుకు పైగా తమిళ సినిమాలను డైరెక్ట్ చేసిన తర్వాత ఆయన తెలుగులో కూడా అడుగుపెట్టారు. జగపతి బాబు, కళ్యాణి కాంబినేషన్‌లో ‘పందెం’ అనే మూవీని తెరకెక్కించి నేరుగా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించారు సభాపతి దక్షిణామూర్తి.

సౌత్ భాషల్లో సినిమాలు

అప్పట్లో జగపతి బాబు, కళ్యాణి కలిసి నటించారంటే ఆ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది అని నమ్మకం ఉండేది. అదే విధంగా వారిద్దరినీ హీరోహీరోయిన్‌గా ఎంపిక చేసుకొని 2005లో ‘పందెం’ (Pandem) అనే మూవీతో వచ్చారు సభాపతి దక్షిణామూర్తి. ఈ సినిమా కాస్త పరవాలేదనిపించింది. తమిళ, తెలుగులో గుర్తింపు రావడంతో ఆయన చూపు కన్నడ ఇండస్ట్రీపై పడింది. 2011లో ‘జాలీ బాయ్’ అనే సినిమాను డైరెక్ట్ చేసి శాండిల్‌వుడ్‌లో కూడా అడుగుపెట్టారు. అదే ఆయన చివరి సినిమా అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అలా ఒక భాషకే పరిమితం అయిపోకుండా దర్శకుడిగా దాదాపుగా ప్రతీ సౌత్ ఇండస్ట్రీని కవర్ చేశారు సభాపతి దక్షిణామూర్తి (Sabapathy Dekshinamurthy). ఆయన డైరెక్షన్‌లో నటించిన నటీనటులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×