E-Paper
Advertisement

Telangana : మైనార్టీలకు రూ.లక్ష సాయం.. తెలంగాణలో మరో కొత్త పథకం.. నిధులున్నాయా..?

Telangana : మైనార్టీలకు రూ.లక్ష సాయం.. తెలంగాణలో మరో కొత్త పథకం.. నిధులున్నాయా..?
Advertisement

Telangana : తెలంగాణలో ఎన్నికలకు మరో 4 నెలల సమయమే ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతోంది. అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ లోని చాలామంది నేతలు హస్తంగూటికి చేరడానికి సిద్ధమవుతున్నారు.

రాష్ట్రంలో తాజా రాజకీయ సమీకరణాలు అధికార బీఆర్ఎస్ పార్టీని కలవర పెడుతున్నాయి. కర్ణాటక ఎఫెక్ట్ తో బీజేపీ బలహీనపడింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా కాంగ్రెస్ వైపు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో గులాబీ బాస్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను నియంత్రించేందుకు కొత్త సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే బీసీల్లో చేతివృత్తులవారికి లక్ష సాయం అందించే పథకాన్ని తీసుకొచ్చారు. కొన్ని రోజుల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించారు.

Advertisement

తాజాగా మరో కొత్త పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులను సర్కార్ జారీ చేసింది. కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేసీఆర్ అన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు సర్కార్ తోడ్పాటు అందిస్తోందన్నారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. భిన్న సంస్కృతులు, విభిన్న మతాల ఆచార సంప్రదాయాలను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలతో మైనారిటీల్లోని పేదరికాన్నినిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సత్ఫలితాలను అందిస్తుందన్నారు.

అట్టహాసంగా ప్రారంభించిన బీసీల్లో చేతివృత్తులవారికి లక్ష సాయం అందించే పథకానికి ఆదిలోనే నిధుల సమస్య ఏర్పడింది. తొలిరోజు డబ్బులు లేకపోవడంతో చాలా జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించలేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అనేక సమస్యలు తలెత్తాయి. ఈ పథకం ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి మైనార్టీలకు లక్ష సాయం అందించే పథకానికి కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఈ పథకానికైనా నిధులున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Big Stories

Advertisement
×