E-Paper
Advertisement

Hyderabad Metro: మెట్రో ఇక సర్కారు సొంతం.. ఎల్‌అండ్‌‌టీ నుంచి స్వాధీనానికి కేబినెట్ నిర్ణయం

Hyderabad Metro: మెట్రో ఇక సర్కారు సొంతం.. ఎల్‌అండ్‌‌టీ నుంచి స్వాధీనానికి కేబినెట్ నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఎల్‌అండ్‌ టీ సంస్థ నుంచి మెట్రోను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ తీర్మానించింది. ఈ  స్వాధీన ప్రక్రియను పర్యవేక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉన్నతస్థాయి మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉండి విధివిధానాలను ఖరారు చేయనున్నారు.

గత ఏడాది కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. ఎల్‌ అండ్‌ టీ సంస్థకు రూ.2 వేల కోట్ల ఈక్విటీని ప్రభుత్వం ఏకమొత్తంగా చెల్లించనుంది. దీంతో పాటు ప్రాజెక్టుపై ఉన్న సుమారు రూ.13 వేల కోట్ల రుణ భారాన్ని సైతం ప్రభుత్వం తన ఖాతాలోకి బదలాయించుకునేలా అవగాహన కుదిరింది. ఈ ఒప్పందం తర్వాతే స్వాధీన ప్రక్రియ వేగవంతమైంది. మెట్రో ఆస్తుల విలువను ఐడీబీఐ క్యాపిటల్‌ మదింపు చేయగా.. రైళ్లు, ట్రాక్‌లు, సిగ్నలింగ్‌ వంటి సాంకేతిక అంశాలపై ఢిల్లీ మెట్రో రైలు సంస్థ (DMRC) ఇప్పటికే ప్రాథమిక నివేదికలను ప్రభుత్వానికి అందజేసింది.

మరోవైపు హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. మొత్తం 86.1 కిలోమీటర్ల మేర సాగే ఈ విస్తరణ ప్రాజెక్టు కోసం సుమారు రూ.19,579 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) ఆమోదించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. కేంద్రం నుంచి ఇటీవల సానుకూల స్పందన రావడంతో పనులు పట్టాలెక్కేందుకు మార్గం సుగమమైంది.

ప్రస్తుతం ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న మెట్రో ఇకపై పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి రావడం వల్ల సామాన్యులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఈ పరిణామాలపై ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భాగ్యనగర వాసుల ప్రయాణ కష్టాలను తీరుస్తూ.. మెట్రోను నగరంలోని నలుమూలలకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ALSO READ: GHMC: జీహెచ్ఎంసీ లో పక్కాగా రాంకీ ఒప్పందం అమలు.. రెండు కార్పొరేషన్లు ప్రైవేటుకు అప్పగించే యోచన

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×