E-Paper
Advertisement

Telangana High court: గచ్చిబౌలిలో ఆ 800 ఎకరాలు ప్రభుత్వానివే.. ఐఎంజీ భారత్ కేసులో హైకోర్టు ఉత్తర్వులు..

Telangana High court: గచ్చిబౌలిలో ఆ 800 ఎకరాలు ప్రభుత్వానివే.. ఐఎంజీ భారత్  కేసులో హైకోర్టు ఉత్తర్వులు..

Telangana High Court latest newsTelangana High Court latest news(TS today news): వేల కోట్ల విలువ చేసే గచ్చిబౌలి భూమి విషయంలో హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 లోని 800 ఎకరాలు ప్రభుత్వానివేనంటూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. 2003లో నాటి చంద్రబాబు ప్రభుత్వం IMG భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కు 850 ఎకరాలు కేటాయిస్తూ ఒప్పందం కుదుర్చుకుంది.

2007లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని ఆ భూమిని వెనక్కి తీసుకుంటూ చట్టం చేసింది.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయంపై IMG భారత్ హైకోర్టునాశ్రయించింది. IMG భారత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం ఎలా చేస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది.

Read More: ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ.. పాతబస్తీ మెట్రో శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి..

కనీస విచారణ లేకుండా, అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా, వేల కోట్ల విలువైన భూములను ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 లో 850 ఎకరాలు ప్రభుత్వానివే అంటూ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ హై కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది.

Tags

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×