E-Paper
Advertisement

పదో తరగతి విద్యార్థులకు అదిరిపోయే అవకాశం..!

పదో తరగతి విద్యార్థులకు అదిరిపోయే అవకాశం..!
Advertisement

Inter Admissions: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ కోర్సులకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉందని తెలిపారు.

అందుబాటులో 40 సీట్లు..

ఈ ప్రవేశాల ద్వారా ఎంపీసీ(MPC), బైపీసీ(BOPC), సీఈసీ(CEC)తో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన ఏసీఈ(అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూపుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రతి గ్రూపులోనూ 40 సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పాత ఎంఈసీ గ్రూప్ స్థానంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఏసీఈ గ్రూపును తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Also read: సినిమాలను డైరెక్ట్ చేసిన కొరియోగ్రాఫర్స్ ఎవరో తెలుసా..?

మే 27న మెరిట్..

అధికారిక వెబ్‌సైట్ telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. మే 27న మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక జాబితాను ప్రకటిస్తారని, మే 28 నుంచి 30 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

Advertisement

Also read: సమ్మర్ క్యాంప్ లో పిల్లల ప్రాణాలు తీస్తున్న ముసుగు హంతకుడు… ఊపిరి బిగబట్టేలా చేసే హారర్ సినిమా

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×