Telangana Police: తెలంగాణలో మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఇక మీదట బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే జైలు తప్పదని వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పోలీసులు కంటబడితే ఇంక అంతే సంగతులు. ఆరు నెలలు జైలు తిండి తప్పదు.
తెలంగాణ పోలీసులు అధికారికి ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ మద్యపానం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. అలా మద్యం సేవించడం వలన ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఇక మీదట రోడ్లపై కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ మద్యం సేవించినట్లైతే కఠిన చర్యలు తప్పవని.. ఆరు నెలల వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
బహిరంగ మధ్యపానం చట్టరీత్యా నేరం. బహిరంగప్రదేశాల్లో మద్యం సేవించటం ప్రజలకు, స్థానికులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇలా రోడ్లపై కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ మద్యం సేవించిన వారిపై కఠినచర్యలు తీసుకోబడతాయి. ఈ నేరానికి 6 నెలల వరకు జైలుశిక్ష పడుతుంది.#ConsumingAlcohol #PublicPlaces #Dial100 pic.twitter.com/xeI5DR5e0O
— Telangana Police (@TelanganaCOPs) June 14, 2024
మందు బాబులు మద్యం సేవించి రోడ్డుపై వీరంగం సృష్టించడం వలన సామాన్య ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చేసేదీమీ లేక అనేక మంది పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటన్నిటిపై తెలంగాణ పోలీస్ శాఖ స్పందించింది. మందుబాబులకు హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: జూబ్లీహిల్స్లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్గం, అసలేమైంది?
ఎవరైనా బహిరంగంగా మద్యం సేవించినట్లైతే 100 కి డయల్ చేయాలని పోలీస్ శాఖ పేర్కొంది. ఇప్పటికైనా మందు బాబుల ప్రవర్తనలో మార్పు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.